YSRCP Neglects Electronics Manufacturing Cluster: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం 2015లో హయాంలో రేణిగుంట విమానాశ్రయానికి ఎదురుగా శ్రీవేంకటేశ్వర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను 122 ఎకరాల్లో ప్రారంభించింది. 2019కి ముందే కార్బన్, సెల్కాన్ సంస్థలు మెబైల్ తయారీ యూనిట్లు ప్రారంభించాయి.
ఓపో, రియల్మీ ఫోన్ల తయారీ సంస్థ విన్టెక్, కార్బన్ అనుబంధ సంస్థ నియోలింక్స్, ప్రముఖ బ్రాండ్ల సెల్ఫోన్లకు కెమెరా లెన్స్ తయారు చేసే సన్ని ఓపోటెక్, యాపిల్ ఉత్పత్తులకు కేబుళ్లు-ఛార్జర్లు తయారు చేసే ఫాక్స్లింక్ యూనిట్లూ ఏర్పాటయ్యాయి. ఆయా యూనిట్లలో 80 శాతం వరకూ ఉద్యోగాలను పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికే కేటాయించారు! అక్కడున్న మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహంతో మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపడంతో రెండోదశ క్లస్టర్కు చంద్రబాబు 502 ఎకరాలు కేటాయించారు. 2019 ఫిబ్రవరిలో ఈఎంసీ (Electronics Manufacturing Cluster)-2 క్లస్టర్కు భూమిపూజ చేశారు.
ఐటీని చావుదెబ్బ కొట్టిన జగన్ సర్కార్- పెట్టుబడుల ఆకర్షణలో అట్టడుగున రాష్ట్రం
2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యాక రేణిగుంటలోని ఈఎంసీ జాతకం తిరగబడింది. చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టుల్ని అటకెక్కించడమే పనిగా పెట్టుకున్న జగన్, ఆ పారిశ్రామికవాడను విస్తరించలేదు! అసలు గుర్తించడానికే ఇష్టపడలేదు. రేణిగుంట విమానాశ్రయంలో ఎప్పుడుదిగినా ఈ క్లస్టర్ను చూసుకుంటూ వెళ్లారేగానీ, దాని అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు. వైఎస్సార్సీపీ పిశాచ గణాలు కూడా అందులోని కంపెనీలపై పెత్తనం చెలాయిండం ప్రారంభించాయి. ఆయా కంపెనీల్లో క్యాంటీన్ కాంట్రాక్టులు, కొత్తగాచేపట్టే నిర్మాణాలకు ఇసుక, మట్టి పనుల కాంట్రాక్టులు తమకు నచ్చివారికే ఇవ్వాలంటూ యాజమాన్యాయాలపై వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు!
అడిగిన రేటుకు ఇచ్చేయండంటూ, కొన్ని కంపెనీలకు హుకుం జారీచేశారు! తమకు నచ్చినవారిని పంపి, ఉద్యోగాలివ్వాల్సిందేనంటూ పట్టుబట్టేవారు! ఇవన్నీ భరించలేకపోతున్నామని ఈఎంసీ నిర్వాహకులు తాడేపల్లి ప్యాలెస్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఏదో ఒకటి చేసుకోండి, నా వరకూ మాత్రం రానీయకండి’ అని ముఖ్యనేత చేతులెత్తేయడం వైఎస్సార్సీపీ నాయకులకు ఇంకా అలుసుగా మారింది. వైఎస్సార్సీపీ సర్కారు పుణ్యమా అని చంద్రబాబు హయాంలో ఒప్పందం చేసుకున్న టి మొబైల్, విన్టెక్, టీసీఎల్ వంటి సంస్థలు మినహా కొత్తగా ఒక్కప్లాంట్ కూడా రాలేదు.
బిమారు రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబాటు - ఐటీ రంగంలో అధమ స్థానంలో రాష్ట్రం