Telugu Women In BRICS Summit Russia :ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకావని నిరూపిస్తోంది ఈ యువతి. చదువుకోవాలనే ఆశతో ప్రభుత్వ విద్యాసంస్థలో చేరి ప్రతిభ కనబరిచింది. ప్రపంచాన్ని బయపెడుతోన్న క్యాన్సర్పై పరిశోధన చేయాలని పీహెచ్డీ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. ఆమె సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ నాయకత్వ లక్షణాలు నేర్చుకుంది. ప్రతిభ, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ యూత్ సదస్సుకు పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
ఆ యువతి పేరు అయేషా. విశాఖపట్నం స్వస్థలం. తండ్రి రెహమాన్ లారీ డ్రైవర్, అమ్మ మదీనాబీబీ చికెన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోన్నారు. పేద కుటుంబం, నిరక్ష్యరాస్యులు అయినా ఈ తల్లిదండ్రులు ఎక్కడా వెనకడుగు వేయలేదు. పిల్లలను బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. వీరి కృషి ఊరికే పోలేదు. కుమార్తెల్లో ఒకరైన ఆయేషా కుటుంబ ప్రతిష్ఠను మరో స్థాయికి తీసుకెళ్లేంది.
ఆర్థిక పరిస్థితుల్లో తన అక్కలు ఇద్దరు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే చూసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంది అయేషా. చదువుల్లో రాణించి విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ చదివింది. పీహెచ్డీ కోసం రెండో ప్రయత్నంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సాధించింది. ఫెలోషిప్తో చదువుకుంటానని కుటుంబాన్ని ఒప్పించి హైదరాబాద్కు వెళ్లింది అయేషా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేరింది అయేషా. పీహెచ్డీ చేస్తున్నప్పుడే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించింది. ఫీజు రీయంబర్స్మెంట్ నిలిచిపోతే పోరాటాలు చేసింది. క్రమంగా విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది. సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొని మానవ హక్కులు, రుతుక్రమం సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి మురికి వాడల్లో ప్రచారం చేసింది. మహిళా సాధికారత కోసం మిషన్ సహస్రి కింద పలు కార్యక్రమాల్లో పాల్గొంది
విజయవాడ విలుకాడు- శిక్షణ ప్రారంభించిన అనతి కాలంలోనే పతకాల పంట - Archery champion Trinath