Woman Kills Husband in Bapatla District During Domestic Dispute : తాగిన మైకంలో భర్త చేస్తున్న వికృత చర్యలు ఆ భార్యను హంతకురాలిగా మార్చేశాయి. అతడు పెట్టే వేధింపులు తాళలేని ఓ మహిళ భర్తనే మట్టు పెట్టింది. తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తాళి కట్టిన భర్త ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి వచ్చినా వెనకాడలేదు. బాపట్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసి తీవ్ర సంచలనం రేపింది.
బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబు (38)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయించింది. వారు అతన్ని మందలించి పంపించారు.