ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాహనదారులకు గుడ్​ న్యూస్ - ఆరు వరసలుగా ఆ రహదారి విస్తరణ - Hyderabad Vijayawada Highway

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 1:54 PM IST

Vijayawada Hyderabad Highway to be Upgraded to Six Lanes:నిత్యం ట్రాఫిక్‌ రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు లైన్లకు జాతీయ రహదారిని విస్తరించడం మూలంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్‌ ఎంపిక ప్రక్రియకు చేయనున్నారు.

Vijayawada Hyderabad National Highway to be Upgraded to Six Lanes
Vijayawada Hyderabad National Highway to be Upgraded to Six Lanes (ETV Bharat)

Vijayawada Hyderabad National Highway to be Upgraded to Six Lanes :​విజయవాడ - హైదరాబాద్‌ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త ఇది. ఈ రెండు ప్రాంతాలకు కలుపుతూ ఉన్న ఎన్​హెచ్-65పై ఎలాంటి ఆటంకాలు లేకుండా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రహదారిని తీర్చిదిద్దనున్నారు. నిత్యం ట్రాఫిక్‌ రద్దీగా ఉండే విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో 6 వరుసలుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Hyderabad-Vijayawada Highway Widening :విజయవాడ - హైదరాబాద్‌ మార్గంలో మొత్తం 221.5కిలో మీటర్లను ఆరు వరుసలకు విస్తరించాలని జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్‌ సమీపంలోని దండు మల్కాపూర్‌ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించింది. అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ ఆరువరుసలకు రోడ్డును విస్తరించనున్నారు.

గంటకు 120కిలో మీటర్ల వేగం-బ్రేక్‌ పై కాలు వేయకుండా చెన్నై బెంగళూరులకు రయ్‌..రయ్ - Bangalore Chennai Expressway

మొదట దండు మల్కాపూర్‌ నుంచి జగ్గయ్యపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా 181.5 కిలోమీటర్లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ట్రాఫిక్‌ రద్ధీని దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయించి మరో 40 కిలోమీటర్ల పెరుగుదలకు అనుగుణంగా డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించారు. డీపీఆర్ రూపకల్పనకు ఈనెల 24ను తుది గడువుగా నిర్ణయిస్తూ తాజా టెండర్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

వాస్తవానికి ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 17 బ్లాక్‌ స్పాట్స్‌ను చక్కదిద్దేందుకు రూ.325 కోట్లతో టెండర్లు పిలిచి పనులను కూడా కాంట్రాక్టు సంస్థకు జాతీయ రహదారుల అప్పగించింది. ఇప్పుడు 221.5 కిలోమీటర్లు విస్తరించే డీపీఆర్‌లో దిద్దుబాటు పనులను మినహాయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44

నందిగామ వద్ద నిర్మాణంలో ఉన్న బైపాస్‌ రోడ్డు పనులను కూడా ఈ టెండరు పరిధి నుంచి తొలగించారు. జగ్గయ్యపేట నుంచి గొల్లపూడి వైపు తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు, పెరుగుతున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. 6 లైన్లకు జాతీయ రహదారిని విస్తరించడం మూలంగా వాహనాల రాకపోకలకు ఆటంకాలు తొలగుతాయని జాతీయ రహదారుల సంస్థ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో చెప్పారు. డీపీఆర్ తయారీ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్‌ ఎంపిక ప్రక్రియకు చేయనున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణకు తొలగిన అడ్డంకులు - టోల్‌ బాధ్యత నుంచి జీఎమ్మార్‌ ఔట్! - hyderabad vijayawada highway

ABOUT THE AUTHOR

...view details