Tirupathi News Today:తిరుపతి, తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ఠ భద్రతా చర్యలను చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది నడక దారిలో భద్రతను మరింత పటిష్టం చేశారు. అలిపిరి వద్ద నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులు గుంపులుగా వదులుతున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది భక్తులు ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 12 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు.
తిరుమలలో చిరుతల సంచారం- కట్టుదిట్టమైన భద్రత - TIGHT SECURITY IN TTD ALIPIRI
తిరుపతి, తిరుమల పరిధిలో చిరుతల సంచారం నేపథ్యంలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు

Tight security measures at TTD Alipiri (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2025, 7:25 AM IST