Supreme Court On Tirumala Laddu Issue :తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఐదుగురు సభ్యులతో సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు కమిటీలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఆహార భద్రతా అథారిటీ - ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కమిటీ పని చేస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణకు ధర్మాసనం విముఖత చూపింది.
దర్యాప్తు కమిటీలో సీబీఐ నుంచి ఎవరు సభ్యులుగా ఉండాలో ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర పోలీసులు ఎవరిని సభ్యులుగా చేర్చాలో డీజీపీ, ఆహార భద్రతా అథారిటీ అధికారిని ఆ సంస్థ ఛైర్మన్ కేటాయిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. లడ్డూ అనేది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భక్తులకు భరోసా కల్పించడం కోసమే స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు.
లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు : ఉపముఖ్యమంత్రి పవన్ - Supreme Court On Laddu Issue
రాజకీయంగా వాడుకోవద్దు : గతంలో టీటీడీ ఛైర్మన్గా పని చేసిన వైసీపీ ఎంపీ వైవిసుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలచుకోలేదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది.
అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదించారు. తిరుమల లడ్డూకు సంబంధించిన అన్ని అంశాలను తాను పరిశీలించానని తుషార్ మెహతా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ పై కేంద్రానికి ఎలాంటి సందేహాలు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిట్లోని అధికారులపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. అయినా పిటిషన్ దారులు స్వతంత్ర విచారణ కోరుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షిస్తే బాగుంటుందని ధర్మాసనానికి తెలిపారు. లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అలా జరిగి ఉంటే మాత్రం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారని సొలిసిటర్ జనరల్ వివరించారు.
సుప్రీం ధర్మాసనం మరో కేసులో బిజీ - తిరుమల లడ్డూ వివాదంపై శుక్రవారం విచారణ - SUPREME COURT ON TTD LADDU ROW
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అనంతరం విచారణను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది ధర్మాసనం.
ఆ ప్రకారం 3.30కి ధర్మాసనం ముందు హాజరైన తుషార్ మెహతా తాను నాలుగో కోర్టులో మరో కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం 10.30కి తీసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి, కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నేడు మళ్లీ విచారణ జరిగింది.
సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూపై సీఎం స్పందించారు: దగ్గుబాటి పురందేశ్వరి - purandeswari on CBN TTD COMMENTS