ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం - STATE LEVEL BANKERS MEETING

వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చ - పీ4 విధానం అమలు అంశాలపై చర్చించనున్న ఎస్ఎల్‌బీసీ

Chandrababu
Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 1:31 PM IST

CM Chandrababu to Meet with Bankers: ఈ నెల 10 తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. 229వ, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17 తేదీన 228వ ఎస్ఎల్​బీసీ సమావేశం జరిగింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు సహా, పీ4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్​బీసీ సమావేశంలో చర్చించనున్నారు.

ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష చేయనున్నారు. 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకెన్ రిపోర్టుపైనా ఎస్ఎల్​బీసీలో చర్చించనున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా సమీక్ష చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశంపైనా ఎస్ఎల్​బీసీ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details