South Central Railway Says Increase Additional General Coaches in 9 Trains : రైళ్లలో సామాన్య ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గించేందుకు జనరల్ బోగీల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచామని, త్వరలో మరో 9 రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతామని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
హైదరాబాద్ నుంచి ముంబయి అక్కడ నుంచి హైదరాబాద్ (22731/22732), హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (12702/12701), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12707/12708), నాందేడ్-అమృత్సర్-నాందేడ్ (12715/12716), హైదరాబాద్-జైపుర్-హైదరాబాద్ (12720/12719), హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (12728/12727), హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (12760/12759), తిరుపతి-హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12793/12794), సికింద్రాబాద్-హిస్సార్-సికింద్రాబాద్(22737/22738). ఈ రైళ్లలో ఆధునిక ఎల్హెచ్బీ బోగీలు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.