ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం - ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసిన కుమారుడు - SON KILLED PARENTS FOR PROPERTY

Son Killed Parents for Property: ఆ ఇద్దరు వృద్ధ దంపతులు ఇద్దరు కుమారులను సమానంగా చూసేవారు. మరణించిన పెద్ద కుమారుడి పిల్లలకు తమ ఆస్తిలో సగభాగం రాయాలనుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని చిన్న కుమారుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 1:28 PM IST

Son Killed Parents for Property
Son Killed Parents for Property (ETV Bharat)

దారుణం - ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపేసిన కుమారుడు (ETV Bharat)

Son Killed Parents for Property in Annamayya District : కుమారులపై ఆ తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. జీవిత చరమాంకంలో తమను మంచిగా చూసుకుంటారని ఆశ పడ్డారు. తమ పిల్లలకు ఏ కష్టం రాకుండా పెంచారు. తమ ఆయువు కూడా పోసుకొని నూరేళ్లు బతకాలి అంటూ ఎన్నోసార్లు దీవించారు. కానీ వారి దీవెనలను ఆ దేవుడు వినలేదేమో ! పెద్ద కుమారుడు మృతి చెందడంతో ఆ వృద్ధ దంపతులు కుమిలిపోయారు. పెద్ద కుమారుడి పిల్లలకు చూసుకునేది ఎవరో అంటూ అనుక్షణం వారి గురించే ఆలోచించేవారు.

దీంతో తమకు ఉన్న ఆస్తిలో సగభాగం పెద్ద కుమారుడి పిల్లలకు రాయాలి అని నిర్ణయించుకున్నారు. ఇది నచ్చని చిన్న కుమారుడు తల్లిదండ్రులపై పగ పెంచుకున్నాడు. తన అన్న కుమారుడి పిల్లలకే కదా ఆస్తిని ఇస్తుంది అని ఆలోచించలేదు. విచక్షణ కోల్పోయి తల్లిదండ్రుల పట్ల దారుణంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతనికి మద్దతుగా భార్య కూడా నిలిచింది. ఇంకేముంది తల్లిదండ్రులను ఆస్తి కోసం ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది.

కుమార్తె వెంట పడొద్దన్నందుకు వ్యాపారి దారుణ హత్య - విజయవాడలో నడిరోడ్డుపై కత్తితో యువకుడి దాడి - Vijayawada Kirana Shop Owner Murder

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులకే విషం:నవమాసాలు మోసి, పెద్ద చేసిన కన్న తల్లిదండ్రులనే కిరాతకంగా హతమార్చాడో కుమారుడు. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులకే విషం ఇచ్చి వారి మరణానికి కుమారుడు, కోడలు కారణమైన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొత్త వడ్డేపల్లిలో జరిగింది. కొత్త వడ్డెపల్లికి చెందిన ఉప్పొల్ల చిన్న సుబ్బయ్య (79), ఆయన భార్య నాగమ్మ (75)లకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మరణించారు. దీంతో అతని పిల్లలకు ఆస్తిలో సగభాగం ఇస్తామని వారు చెప్పడంతో తల్లిదండ్రులపై వారి చిన్న కుమారుడు రమణయ్య పగబట్టాడు.

రమణయ్య, అతని భార్య కళావతి ఎలాగైనా చిన్న సుబ్బయ్య, నాగమ్మలను చంపాలనే ఉద్దేశంతో విషం కలిపి వృద్ధులకు ఇచ్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని చూసి గ్రామస్థులు వెంటనే అంబులెన్స్​కి కాల్ చేసి, చిన్న సుబ్బయ్య, నాగమ్మలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రుల ప్రాణాలను బలిగొన్న కుమారుడు, కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

నడిరోడ్డుపై యువతిని కొట్టి చంపిన ప్రియుడు- పోలీసులు వచ్చే వరకు మృతదేహం వద్దే!

ABOUT THE AUTHOR

...view details