Trains Cancelled in AP :సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట- విజయవాడ సెక్షన్లో జరుగుతున్న భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశామని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ పేర్కొన్నారు. దీంతో పాటు మరి కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 10 నుంచి 20 వరకు విశాఖ- ఎల్టీటీ(18519), 12 నుంచి 22 వరకు ఎల్టీటీ-విశాఖ (18520), 13న టాటానగర్-యశ్వంత్పూర్(18111), 9, 16న యశ్వంత్పూర్- టాటానగర్(18112) రైళ్లు రద్దయినట్లు ఆయన చెప్పారు .
దారి మళ్లించినవి : ఈనెల 17, 19 తేదీల్లో షాలిమార్- హైదరాబాద్ (18045), 18, 20 తేదీల్లో హైదరాబాద్- షాలిమార్ (18046) రైళ్లను వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడపనున్నట్లు కె.సందీప్ వివరించారు. 17 నుంచి 19 వరకు ముంబయి- భువనేశ్వర్- ముంబయి (11019- 11020) రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, వాడి స్టేషన్ల మీదుగా, 19న షాలిమార్- సికింద్రాబాద్ (22849) రైలు వయా విశాఖ, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి నడుపుతామని చెప్పారు.