ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఖైరతాబాద్‌ గణేశుడికి 280 జంటలతో రుద్రహోమం - భారీగా తరలివచ్చిన భక్తులు - KHAIRATABAD GANESH RUDRA HOMAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 7:47 PM IST

Khairatabad Ganesh Pooja 2024 : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లోని ఖైరతాబాద్‌ సప్తముఖ మహాశక్తి గణేశుడి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో ఏకంగా 280 జంటలు పాల్గొన్నాయి.

Khairatabad Ganesh Pooja 2024
Khairatabad Ganesh Pooja 2024 (ETV Bharat)

Rudra Homam with 280 Couples at Khairatabad Ganesh : విజ్ఞాలను తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడలా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్​లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సైతం భారీ ఎత్తున ఆ బడా గణేశునికి పూజలు అందుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది భక్తుల నడుమ ఇవాళ లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగవైభవంగా నిర్వహించారు.

రుద్రహోమానికి అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు (ETV Bharat)

ఖైరతాబాద్ బడా గణేష్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద రుద్రహోమంలో పాల్గొన్న భక్తులు (ETV Bharat)

సప్తముఖుడికి లక్ష రుద్రాక్షమాల : ఖైరతాబాద్​లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సోమవారం శివ పార్వతుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులు మహా గణపతికి లక్ష రుద్రాక్షమాలతో అలంకరించారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలానే ప్రముఖులు సైతం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఇక్కడకి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది.

లక్ష రుద్రాక్షమాలతో సప్తముఖ మహాశక్తి గణపతికి భక్తులు అలంకరణ (ETV Bharat)

అత్యవసర పరిస్థితులు ఏమైనా ఎదురైతే వాటిని దృష్టిలో పెట్టుకొని అంబులెన్సులను సైతం ఏర్పాటు చేసింది. బడా గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అడుగడుగున పోలీసుల పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్​కు ఎలాంటి ఇబ్బందిలేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు.

ఖైరతాబాద్‌ గణేశుడి వద్ద బారులు తీరిన భక్తులు (ETV Bharat)


నిత్యం వేలాది మంది గణపయ్యను చూడడానికి తరలి వస్తుండడంతో భద్రతను పూర్తిస్థాయిలో పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జంట నగరాల నుంచి వస్తున్న భక్తులతో బడా గణేశ్​ ప్రాంగణమంతా కిటకటలాడుతోంది.

280 జంటలతో లక్ష్మీ గణపతి రుద్ర హోమం (ETV Bharat)

గణనాథునికి ఒకేసారి 21 వేల మంది విద్యార్థుల ప్రార్థన - ముక్తకంఠంగా 'అథర్వ స్త్రోత్ర' పారాయణం - Ganesh Chaturthi 2024

గణపయ్యకు ఒకేసారి 42వేల మంది మహిళల హారతి- గిన్నిస్ రికార్డు దాసోహం - Devotees Harathi

ABOUT THE AUTHOR

...view details