Madakasira Road Accident Today : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మడకశిర మండలం బుళ్లసముద్రం జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామన ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
లారీని ఢీకొట్టిన యాత్రికుల మినీ వ్యాన్ - నలుగురు దుర్మరణం - MADAKASIRA ROAD ACCIDENT TODAY
శ్రీసత్యసాయి జిల్లా బుళ్లసముద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2024, 7:07 AM IST
|Updated : Dec 21, 2024, 9:14 AM IST
క్షతగాత్రులను హిందూపురం, బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. మృతులు గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా పోలీసులు గుర్తించారు. రత్నమ్మ (68), మనోజ్ (32), ప్రేమ్కుమార్ (30), అధర్వ (4) మృతిచెందినట్లు తెలిపారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 14 మంది యాత్రికులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ప్రమాదంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు.
పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - నలుగురు యువకుల దుర్మరణం - ROAD ACCIDENT