ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలు - MUNICIPAL COUNCIL CHAIRMAN ELECTION

ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పురపాలక సంఘం ఛైర్మన్‌ ఎన్నికలకు సర్వం సిద్దం

ntr_district_nandigama_municipal_council_chairman_election
ntr_district_nandigama_municipal_council_chairman_election (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2025, 11:07 AM IST

NTR District Nandigama Municipal Council Chairman Election :ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పురపాలక సంఘం ఛైర్మన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా ఇద్దరు కౌన్సిలర్లు చనిపోవడంతో అవి ఖాళీగా ఉన్నాయి. 18 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌తో కలిపి మొత్తం 20 మందికి ఓటు హక్కు ఉంది. టీడీపీ జనసేనకు కలిపి 14 మంది కౌన్సిలర్లు ఉండటంతో వీరు నిర్ణయించిన వారే ఛైర్మన్‌ అయ్యే వీలుంది. హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు రోజే హిందూపురానికి చేరుకున్నారు. మున్సిపాలిటికీ 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు.

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలు (ETV Bharat)
21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీ బలం 23గా ఉంది. వైఎస్సార్సీపీకి 17 స్థానాలే ఉన్నాయి. దీంతో టీడీపీకే ఛైర్మన్‌ సీటు దక్కే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్‌ ఛైర్మన్‌ ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కోవూరు మండలం లేగుంటపాడులోని వేమిరెడ్డి గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలు, కౌన్సిలర్లతో చర్చించారు. మొత్తం 20 స్థానాలు ఉండగా ప్రస్తుతం టీడీపీ బలం 14గా ఉంది. దీంతో వైస్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీకే దక్కే వీలుంది.

ABOUT THE AUTHOR

...view details