YSRCP Fake Campaign on Tanuku Anna Canteen Says Minister Nara Lokesh :అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విష ప్రచారం చేసేందుకే వైఎస్సార్సీపీ సైకో బ్యాచ్ తణుకు అన్న కాంటీన్లో చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసిందని ధ్వజమెత్తారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారని స్పష్టం చేశారు.
చేతులు కడుగు స్థలంలో వైఎస్సార్సీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారుల నుంచి వివరాలు తీసుకున్న మంత్రి నారాయణ ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు చెప్పారని తెలిపారు. వాష్ బేసిన్లోని పేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒకేసారి అన్న క్యాంటీన్కి ఎక్కువ మంది రావడంతో ప్లేట్లను డస్ట్ బిన్కు బదులుగా వాష్ బేసిన్లో పెట్టారని అధికారులు తెలిపారని మంత్రికి వివరించారు. అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయన్న హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులుసోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు.