International Experts Team Observation of Polavaram Project:పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణుల బృందం ఈసీఆర్ఎఫ్ గ్యాప్-2లో సేకరించిన మట్టి, రాతి నమునాలను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాప్లను చూశారు. నిపుణుల బృందానికి నమూనాల నాణ్యతను ఇంజినీర్లు వివరించారు.
'నమూనాలు పరిశీలిస్తూ, నాణ్యతను అంచనా వేస్తూ'- పోలవరంలో నిపుణుల పరిశీలన - Polavaram Project
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 12:30 PM IST
|Updated : Jul 2, 2024, 1:52 PM IST
International Experts Team Observation of Polavaram Project: పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈసీఆర్ఎఫ్లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించిన నిపుణులు వివిధ కోణాల్లో పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ నిపుణులు డివిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్బెర్గర్ తదితరులు ఇవాళ, రేపు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు చేసిన పరిశీలనలో నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు.
ఆ ఆలోచన సరికాదు - నీళ్లలో ఉన్నా ఏం కాదు - Polavaram Diaphragm Wall condition