ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 1:45 PM IST

Increasing Diarrhea Death Cases in Vijayawada: విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కలుషిత నీరు పైప్ లైన్లలో కలుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Increasing_Diarrhea_Death_Cases_in_Vijayawada
Increasing_Diarrhea_Death_Cases_in_Vijayawada (ETV Bharat)

Increasing Diarrhea Death Cases in Vijayawada:విజయవాడలో డయేరియాతో మృతిచెందిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. పాయకాపురంలో కనకమ్మ అనే మహిళ అతిసార లక్షణాలతో మృతిచెందారు. బాధిత కుటుంబాలను సీపీఎం నేత సి.హెచ్. బాబురావు పరామర్శించారు. ఇప్పటికీ చనిపోయిన వారిని డయేరియా మరణాలుగా ప్రకటించని వీఎంసీ అధికారుల తీరు హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.

మరణించిన వారికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని వీఎంసీ కమిషనర్ ప్రకటించడం సరికాదన్నారు. కలుషిత నీరు పైప్ లైన్లలో కలుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని నగర వాసులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! - Contaminated Drinking Water

విజయవాడలో డయేరియా లక్షణాలతో గురువారం రాత్రి మరో మహిళ మరణించింది. మొగల్రాజపురంలో డయేరియా లక్షణాలతో మెట్టు అంజమ్మ చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే యువకుడు వాంతులు, విరోచనాలతో కుప్పకూలిపోయాడు. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు వద్దకు మందుల కోసం వచ్చిన ఆనంద్ మందులు తీసుకుని క్యాంప్ బయటకు వస్తుండగానే కుప్పకూలిపోయాడు.

వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. పాయకాపురం ప్రాంతంలో ఓ వృద్ధురాలు, బాలుడు అతిసార లక్షణాలతో చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. విజయవాడ నగరంలో సుమారు 150మంది వరకు డయేరియా సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తమ కుటుంబ సభ్యులు వాంతులు, విరోచనాలతోనే మరణించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

"విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. సుమారు 150మంది వరకు డయేరియా సమస్యతో బాధపడుతున్నారు. అయితే వీఎంసీ, వైద్యారోగ్య అధికారులు ఈ లెక్కల తీవ్రతను తక్కువ చేసి చెబుతున్నారు. ప్రాథమికంగా ఈ ప్రాంతాల్లో డయేరియాకి కలుషిత నీరే కారణమని చెబుతున్నా, అధికారులు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో అలసత్వం ప్రదర్శించడం అన్యాయం." - సి.హెచ్. బాబురావు, సీపీఎం నేత

తాగునీటి సమస్యపై ఆలస్యంగా మేల్కొన్న అధికారులు - నీటి నమూనాలో నైట్రేట్స్ గుర్తింపు - Mogalrajapuram Water Contamination

ABOUT THE AUTHOR

...view details