తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐఏఎస్​పై ఈడీ ప్రశ్నల వర్షం - భూదాన్ భూముల స్కాంలో చిక్కుముడులు వీడినట్టేనా!

భూదాన్ భూముల బదిలీపై ఈడీ విచారణ - ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్​ను 8 గంటల పాటు విచారణ - గతంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్​

bhoodan Land Scam
Ed Questioned IAS Officer Amoy kumar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Ed Questioned IAS Officer Amoy kumar : రంగారెడ్డి జిల్లా భూదాన్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ అక్రమాల విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఇవాళ ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో వందల కోట్ల విలువైన 42ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపణలు రావడంతో అప్పట్లో దీనిపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపారు. అక్రమాలపై నిజానిజాలను తేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.

దర్యాప్తులో భాగంగా ఆ సమయంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్​గా ఉన్న అమోయ్​ కుమార్​ను విచారణకు రావాలని ఈడీ 4 రోజుల క్రితం నోటీసులు జారీచేసింది. ఈనెల 22 లేదా 23న విచారణకు రావాలని అందులో సూచించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం 8గంటలకే న్యాయవాదితో కలిసి అమోయ్ కుమార్ బషీర్​ బాగ్​లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల పాటు దాదాపు విచారించారు.

భూములు ఏ విధంగా బదిలీ చేశారు, ఎవరెవరికి బదిలీ చేశారు, ఎవరి ఒత్తిడితో ఈ వ్యవహారం కొనసాగింది తదితర అంశాలపై అమోయ్‌కుమార్‌ను అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయిన తర్వాత ఆయన తన న్యాయవాదితో కలిసి తిరిగి వెళ్లిపోయారు. అయితే రేపు మరోసారి అమోయ్‌కుమార్‌ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

నవంబరు నుంచి భూముల ధరల సవరణ - అమల్లోకి తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం - Revision of Land Prices

ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్ - ఫిర్యాదులకు టోల్​ఫ్రీ నంబర్​ ఇదే!

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details