తెలంగాణ

telangana

నీటివృథా అడ్డుకట్టకు మీటర్లు - నిరంతర సరఫరాకు తోడ్పాటు - water supply construction

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 10:33 AM IST

Water Supply Pilot Project in Karimnagar : రాష్ట్రంలోనే నిరంతర తాగునీటి సరఫరాకు కరీంనగర్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీ పైలెట్ ప్రాజెక్టుగా మారబోతోంది. దాదాపు రూ.18 కోట్లతో నాలుగు డివిజన్ల పరిధిలో పైప్‌లైన్ల నిర్మాణంతో పాటు మీటర్లు బిగించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మీటర్లు పెట్టడం సహా నిరంతర సరఫరాతో నీటివృథా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Drinking water supply Project in Karimnagar
Water Supply Pilot Project in Karimnagar (ETV Bharat)

నీటివృథా అడ్డుకట్టుకు మీటర్లు - నిరంతర సరఫరాకూ తోడ్పాటు (ETV Bharat)

Drinking water supply Project in Karimnagar :కరీంనగర్‌కు దిగువ మానేరు జలాశయం అందుబాటులో ఉండటంతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాన్ని అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 4 వేల నివాసాలను లక్ష్యంగా నిర్ణయించుకున్న నగరపాలక సంస్థ, ఇప్పటికే 3వేల ఇళ్లకు పైగా మీటర్లను బిగించింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మాడ్రన్ హౌజింగ్ బోర్డు కాలనీకి ప్రయోగాత్మకంగా నిరంతర మంచినీరు సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కరీంనగర్‌లో అందరికీ నిరంతర నీటి సరఫరా అందిచాలన్న ప్రణాళిక ఉన్నా 4 డివిజన్లలో ఎదురయ్యే లోటుపాట్లు పరిశీలించి మిగతా చోట్ల అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టులో ఇబ్బందులు తెలుసుకొని ఏజెన్సీ సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారంలో ఒక్కొక్కరికి రోజుకు 160 లీటర్లు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక్కో ఇంటి నుంచి నీటి సరఫరా కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నీటిని వృథా చేయకుండా వాడుకుంటే 100 రూపాయల కంటే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

'కరీంనగర్​లో హౌజింగ్ బోర్డు పరిధిలో దాదాపు 4 డివిజన్లలో నాలుగు వేల గృహాలకు సంబంధించి 24 గంటలు మంచినీరు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. రూ.18 కోట్లతో పనులు ప్రారంభించాం. పైప్‌లైన్ల పనులు పూర్తవుతున్నాయి. జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో 4 వేల గృహాలకు మంచి నీరు అందేలా ప్రణాళికలు తీసుకుంటున్నాం'- సునీల్‌రావు, కరీంనగర్ మేయర్‌

ప్రస్తుతం దిగువమానేరు జలాశయంలో నీటి మట్టం 5 టీఎంసీలకు పడిపోవడంతో రోజు మినహా రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సమస్య వల్ల కొన్నిసార్లు నీటిసరఫరా సమయంలో గందరగోళం నెలకొంటోంది. నిరంతర నీటి సరఫరా వల్ల ఇబ్బందులు తొలుగుతాయని గృహిణులు చెబుతున్నారు. పైప్‌లైన్లు ఇతరత్రా పనులు చివరి దశకు చేరడంతో భవిష్యత్‌లో నిరంతర నీరు సరఫరా అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

'మంచినీళ్లు రోజు వస్తున్నాయి కానీ గంట మాత్రమే వచ్చేవి. ఆ సమయంలో మేం లేకపోతే ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు దానికి మీటరు బిగించారు. దీంతో రోజులో ఎప్పుడైనా వస్తున్నాయి. వాటర్​ ప్రస్తుతం స్లోగా వస్తున్నా ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నారంట ఒకవేళ మేం లేకపోయినా వచ్చినా తర్వాత ఆన్​ చేసుకునేలా సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు 24 గంటల నీరు సరఫరా అవుతోంది. ఇంతకముందు ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవు'- గృహిణులు

మంచి నీళ్లివ్వడానికి ప్రాజెక్టు నిర్మాణం - పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగం - D Fluoride Project in Warangal

నిధులు కరుగుతున్నా - నీళ్లు మాత్రం అందట్లేదు - పంట కాలువను నమ్ముకున్న రైతన్న కంట కన్నీరు - Khammam Farmers Problems

ABOUT THE AUTHOR

...view details