Gas To Every Home Through Pipeline :దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్ లాంటి మహా నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీలకే పరిమితమైన ఇంటింటికి పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా ఇప్పుడు గుంటూరు జిల్లా వాసులకు అందుబాటులోకి రానుంది. మంత్రి నారా లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటికి గ్యాస్ అందించనున్నారు. మహిళల వంటింటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది.
మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా మంత్రి లోకేశ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈక్రమంలోనే తొలిసారిగా మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పైపులైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ పంపిణీ దిశగా చర్యలు చేపట్టారు. ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరాకు అనుమతివ్వాలని నగరపాలక సంస్థకు మంత్రి లోకేశ్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ అనుమతులివ్వడంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు పైపు లైన్ల పనులపై దృష్టిపెట్టారు. ఇప్పటికే తాడేపల్లి నుంచి కాజా వరకు 14 కిలోమీటర్ల ప్రధాన పైపులైన్ పనులు పూర్తిచేశారు. అంతర్గత రహదారుల్లో పైప్లైన్ల పనులు జోరందుకున్నాయి.సుమారు 220 కిలోమీటర్ల మేర ప్రధాన, అంతర్గత రహదారుల్లో పైపులైన్లను 2 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
'ఉచిత గ్యాస్'కి సూపర్ రెస్పాన్స్ - మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారా?