ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మినిస్టర్స్, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ- ఉదయం నుంచి సాయంత్రం వరకు - CM MEETING WITH SECRETARIES

ఈ నెల 11న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు సమావేశం - మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాలనా అంశాలపై చర్చ

CM CHANDRABABU
CM CHANDRABABU (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 7:55 PM IST

CM CHANDRABABU MEETING WITH SECRETARIES: ఈ నెల 11వ తేదీన సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుందని తెలియడంపై ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.

మొదటి సెషన్​లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్​లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశ పెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. దీనిపై 10వ తేదీ మధ్యాహ్నం లోగా సెక్రటరీలు తమ డిపార్ట్​మెంట్​కు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సీఎస్ ఆదేశాలిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details