ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను అభినందించిన సీఎం - CM CHANDRABABU ON KHEL RATNA AWARDS

గుకేశ్ తన ప్రతిభతో మరింత రాణించాలని కోరుకుంటున్నానన్న సీఎం చంద్రబాబు - అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి, జీవాంజి దీప్తికి అభినందనలు

CM_Chandrababu
CM Chandrababu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 10:38 PM IST

CM Chandrababu On Khel Ratna Awards: దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎయిర్ గన్ షూటింగ్​లో ఒలింపిక్స్ పతక విజేత మను బాకర్, భారతీయ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీలో ఒలింపిక్ పతక విజేత టీమ్ సభ్యుడు హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్​లో ఒలింపిక్ పతక విజేత ప్రవీణ్ కుమార్​లను ఈ సందర్భంగా అభినందించారు.

చదరంగంలో బాల్యం నుంచే ప్రతిభ కనబరుస్తూ, చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన గుకేశ్ 2024 చెస్ టోర్నమెంట్​లో విశ్వ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును అందుకుంటున్న గుకేశ్, తన ప్రతిభతో మరింతగా రాణించాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే అర్జున అవార్డ్ గ్రహీతలు విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ, వరంగల్​కు చెందిన పారా అథ్లెట్ జీవన్‌జీ దీప్తికి అభినందనలు తెలిపారు.

తెలుగువారు ఎంపిక కావడం సంతోషం:అదే విధంగా య‌ర్రాజీ జ్యోతిని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు అభినందించారు. జాతీయ క్రీడా పుర‌స్కారాల‌కు తెలుగువారు ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డు తెలుగు వారందరికీ ప్రోత్సాహాన్నిస్తుందని, భవిష్యత్తులో జ్యోతి మరిన్ని విజయాలు సాధించాలని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ఆకాంక్షించారు.

మను బాకర్, గుకేశ్​కు ఖేల్​రత్న- మరో ఇద్దరు ఒలింపిక్ విన్నర్స్​కు కూడా

ABOUT THE AUTHOR

...view details