ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 4:50 PM IST

ETV Bharat / state

రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించేందుకే వాలంటీర్​ వ్యవస్థ : వల్లెంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి

Citizens for Democracy Program on Votes in Sathyasai District : 'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లాలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 'రంగం' కళాకారులు ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Lets_Vote_and_Strengthen_Democracy_Program_in_Sathya_Sai_District
Lets_Vote_and_Strengthen_Democracy_Program_in_Sathya_Sai_District

రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టించేందుకే వాలంటీర్​ వ్యవస్థ : వల్లెంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి

Citizens for Democracy Program on Votes in Sathyasai District:శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని శివ సాయి డిగ్రీ కళాశాలనందు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'రంగం' కళాకారులు ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల అనంతరం సంయుక్త కార్యదర్శి వల్లెం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' - విశాఖలో సీఎఫ్​డీ కళాజాత ప్రారంభం

అలాగే ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యం యెుక్క విలువలు కాపాడాలని, రాజ్యాంగా స్ఫుర్తిని భధ్రంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఓటర్లను చైతన్య వంతులను చేసి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకొవాలని కోరారు. సమాజానికి మంచి చేసే వారిని ప్రజలు ఎన్నుకునేందుకే ఈ కళాజాత ప్రారంభించామని తెలిపారు.

Kalajata program in Sathya Sai District :ఈ కళాజాత కార్యక్రమం శ్రీకాకుళంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైందని, శుక్రవారం కర్నూలులో ముగుస్తుందని తెలిపారు. ప్రస్తుతం లోక్ సభలో 30 శాతం మంది నేరుస్థులు ఉన్నారని మండిపడ్డారు. వందలాది కోట్లు సంపాదించిన వారు లోక్​సభలో సభ్యులుగా ఉన్నారని వీరు ఒక విషయంపై ఏకధాటిగా పది నిమిషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సైతం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాలేదు: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

చట్టసభలు జరగాల్సిన రోజులు జరగటం లేదు. సభ జరిగిన రోజులల్లో సైతం నిరంతరం గొడవలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కులాల మధ్య గొడవలు పెట్టటం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిదంన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితులలో ఓటర్లు చైతన్యవంతులుగా మారి ఈ రాజకీయాలను మార్చాలని పిలుపునిచ్చారు. అలాగే స్వచ్చందంగా ప్రజలకు సేవ చేసేందుకు పెట్టుకున్న వాలంటరీ వ్యవస్థను జగన్ ఎన్నికలకు సైన్యంగా ఉపయోగించుకోవటం దారుణమన్నారు. వాలంటీర్​లను బహిరంగంగానే ప్రజాప్రతినిధులు వైసీపీ కార్యకర్తలని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని భ్రఘ్ట పట్టిచ్చేందుకే వాలంటీర్​ వ్యవస్థను జగన్​ ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. ఇలాంటి వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యావంతులు, ఉద్యోగస్థులు ఓటును బాధ్యతగా గుర్తించుకోవాలన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో చాలా తక్కువ శాతం ఓట్లు పోలవడాన్ని విద్యావంతులు గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులే ఓటు వేయకపోతే ఇక సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కావున రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఈ కళాజాత కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు.

ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలు ధిక్కరించినట్లే: నిమ్మగడ్డ రమేష్​కుమార్​

ABOUT THE AUTHOR

...view details