CC Cameras Not Proper Working in Tirupati: నిత్యం లక్షల మంది భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో నిఘా వ్యవస్థ నిద్రాణ స్థితిలో ఉంది. నేరాలకు అడ్డుకట్ట వేసి నిందితులను పట్టించడంలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు(CC cameras) అలంకారప్రాయంగా మారాయి. కొత్త కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటిని కూడా అటకెక్కించారు. ఇదే అదనుగా అల్లరి మూకలు, దొంగలు(Thieves) రెచ్చిపోతున్నారు. ఆలయాలు(Temples), ప్రధాన రహదారులు(Main Roads), అతిథి గృహాల్లో(Guest Houses) భద్రతా చర్యలు లేక నగరవాసులు, యాత్రికుల భద్రత గాల్లో దీపంలా మారింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య కుమార్తె
ఏడు కొండల వాడు కొలువైన తిరుమల ఆలయం(Tirumala Temple) ఓ వైపు, గోవిందరాజస్వామి(Govindarajaswamy), కపిలతీర్థం(Kapilatirtham), తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానం(Tiruchanur Padmavati Ammavari Devasthanam), శ్రీకాళహస్తి(Srikalahasti), కాణిపాకం(Kanipakam) వంటి ప్రసిద్ధ దేవాలయాలు మరోవైపు.
ఇవే కాదు ఏడు విశ్వవిద్యాలయాలు(Universities), ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు(Industries). ఇంత ప్రాముఖ్యత కలిగిన నగరంలో నిఘా వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. కానీ పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రీవారి భక్తులు, నగరవాసుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తిరుపతిని సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామన్న అధికారుల ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్న నిఘా కెమెరాలు సైతం పని చేయట్లేదు.