ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - APOSS Exam Result Release
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 7:37 PM IST
APOSS 10th, intermediate Public Exam Result Release: జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్ధులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
APOSS 10th, intermediate Public Exam Result Release:ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం జూన్ 2024లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ (APOSS) పబ్లిక్ పరీక్షల ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఎస్ఎస్సీ పరీక్షలకు 15,058 విద్యార్ధులు హాజరుకాగా 9,531 విద్యార్ధులు 63.30 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 27,279 విద్యార్ధులు హాజరుకాగా 18,842 మంది ఉత్తీర్ణత పొంది 69.07 శాతం పాస్ అయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (AP Open School Society) అధికారిక వెబ్ సైట్ https://apopenschool.ap.gov.inలో విద్యార్ధులు ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్ధులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.