Vehicles Stuck at Kodada due to Flooding: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు పొటెత్తడంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. గంటల కొద్ది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను అధికారులు వెరే మార్గాలకు మళ్లించారు. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 31 August 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sat Aug 31 2024- వరద ప్రభావం - హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు దారి మళ్లింపు - Vehicles Stuck at Kodada
By Andhra Pradesh Live News Desk
Published : Aug 31, 2024, 7:00 AM IST
|Updated : Aug 31, 2024, 10:45 PM IST
వరద ప్రభావం - హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు దారి మళ్లింపు - Vehicles Stuck at Kodada
రాజమహేంద్రవాసులకు తీపికబురు - ఇకపై రేషన్ షాపులో ఆ సరకులు కూడా - Good News For Ration Card Holders
Good News For Ration Card Holders in East Godavari District: జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానంపై విసిగిపోయిన ప్రజలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, లబ్ధిదారులకు ప్రతినెలా బియ్యంతో పాటు, పంచదార, రాగులు ఇవ్వనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పౌరసరఫరాల అధికారి విజయభాస్కర్ తెలిపారు | Read More
నూజివీడు ట్రిపుల్ ఐటి ఘటనపై మంత్రి లోకేశ్ ఫైర్ - డైరెక్టర్ తొలగింపు - Lokesh on Nuziveedu IIIT issue
Lokesh Inquire about Ill Health of Students in Nuziveedu IIIT : నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల అస్వస్థతపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరక్టర్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముగ్గురు సభ్యులతో కూడిన పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేశారు. ఇకపై అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. | Read More
అల్పపీడనం ప్రభావం - ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు - Heavy rains in Prakasam district
Heavy Rains are Falling in Prakasam District : అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీంతో ముందస్తుగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరోవైపు చాలా రోజుల తర్వాత వర్షాలు రావటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. | Read More
ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు అందించాలి - టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపు - Nara Lokesh Review on Rains
Minister Nara Lokesh Review on Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్షించారు. టీడీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికపుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలలో తక్షణమే సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు. | Read More
ప్రయాణికులకు అలర్ట్ - విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దు - many trains cancelled in Vijayawada
South Central Railway has cancelled Many Trains : భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. భద్రతా కారణాల రీత్యా వీటిని రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. | Read More
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు - ప్రజలకు మంత్రుల సూచన - Ministers Review on Heavy Rains
Ministers Review on Rains Falling Across the State: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రులు ఎప్పటికప్పుడు వర్ష ప్రభావంపై ఆరా తీస్తున్నారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. మరో 24 గంటల వరకూ వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. | Read More
అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటనున్న వాయుగుండం - భారీ వర్షాలు - Heavy Rains in Srikakulam District
Heavy Rains in Srikakulam District : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా అడపాదడపా పడిన వానలు ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా పడుతున్నాయి. కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం తీరానికి చేరుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. | Read More
గుంటూరు జిల్లా: వాగులో కొట్టుకుపోయిన కారు-ముగ్గురు మృతి - Car washed out three dead
Three people died after their car got washed : గుంటూరు జిల్లాలో కారు వాగులో కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన పెదకాకాని మండలం ఉప్పలపాడులో చోటుచేసుకుంది. పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని వస్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. | Read More
వైఎస్సార్సీపీ నాయకుడి వేధింపులు - విజయవాడ సీపీ కార్యాలయానికి ముంబయి నటి కుటుంబసభ్యులు - Actress Jathwani Family met CP
Actress Jathwani and her Family met Vijayawada CP: ముంబయి నటి ఆమె కుటుంబసభ్యులు మరోసారి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదితో కలిసి సీపీ కార్యాలయానికి వచ్చిన నటి కుటుంబసభ్యులు స్టేట్మెంట్ ఇచ్చారు. నటి కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ని పోలీసులు రికార్డు చేశారు. | Read More
ఉమ్మడి గుంటూరు జిల్లాలో దంచికొడుతున్న వానలు - స్తంభించిన జనజీవనం - Guntur Heavy Rains
Heavy Rains in AP : అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. | Read More
విష జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు - రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య - Viral Fevers Tension In AP
People Suffering From Viral Fevers: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ల్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది బాధపడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం డెంగీ, మలేరియా కంటే విష జ్వరాలు వేధిస్తున్నాయి. | Read More
వంతెనల నిర్వాహణలో జగన్ జాప్యం-ప్రమాదం అంచున నిత్యం రాకపోకలు - PEOPLE SUFFER DUE TO DAMAGED BRIDGE
People Suffer Due to Damaged Bridge in Anantapur District : వైఎస్సార్సీపీ జాప్యం కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వంతెన నిర్మాణ పనులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. గతేడాది చివర్లో వంతెన పునర్నిర్మాణం పేరిట నిధులు విడుదల చేసిన సకాలంలో పనులు పూర్తిచేయకపోయింది. దీంతో వావానదారులు నిత్యం ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన వంతెనల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. | Read More
పారిశ్రమల హబ్గా చిత్తూరు జిల్లా-శరవేగంగా అడుగులు వేస్తోన్న సర్కార్ - Development of Chittoor District
Development of Chittoor District : చిత్తూరు జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చి దిద్దేందుకు కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది. జగన్ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతోంది. జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్కులో ఖాళీ ప్లాట్లను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులతో జరిపిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. | Read More
5స్టార్ రేటింగ్ సైబర్ క్రైమ్- సుమారు ₹5 లక్షలు! - Cyber Crime in Krishna District
Cyber Crime in Krishna District : సైబర్ నేరాల గురించి రోజూ వింటూనే ఉంటాం. మన దాకా వస్తే మాత్రం గుర్తించలేం. సులభంగా డబ్బులు వస్తాయి అంటే ఆలోచించకుండా ఆ పని చేస్తాం. తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటాం. తాజాగా ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లాలో జరిగింది. | Read More
అత్యవసరమైతేనే బయటకు రండి - ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు సూచనలు - Heavy Rains in aP
Ministers Review on Heavy Rains in Andhra Pradesh : బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు గొట్టిపాటి, అనగాని సత్యప్రసాద్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. | Read More
రాష్ట్రంలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష - వానలపై ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్లు పంపాలి - Heavy Rains in AP
Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్లు పంపాలని చంద్రబాబు అన్నారు. | Read More
విజయవాడలో విరిగిపడిన కొండచరియలు - చెరువులను తలపిస్తున్న రహదారులు - Landslide in Vijayawada
Heavy Rains in AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ బాలిక మృతి చెందగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారో అని అధికారులు పరిశీలిస్తున్నారు. | Read More
రిటైర్మెంట్ డబ్బుల కోసం తండ్రిని చంపిన కేసు - నిందితులకు జీవిత ఖైదు - Rangareddy Court Father Murder Case
RangaReddy Court Sensational Verdict : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జిల్లేలగూడలో రిటైర్మెంట్ డబ్బుల కోసం తండ్రిని హత్య చేసిన ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఈ కేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. | Read More
సత్యం పలికించే బండ - ఈ మిస్టీరియస్ టెంపుల్ ఎక్కడుందంటే? - Rajanala Banda Temple Story
Rajanala Banda Temple Story : అత్యంత మహిమాన్వితమైన ఆలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలోనే సత్యప్రమాణాల క్షేత్రంగా ఓ ఆలయం పేరుగాంచింది. అందుకే న్యాయం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మరి ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
నేలంతా విషమంట - రసాయన ఎరువుల దయేనట! - Chemical Fertilizers in Crops
Chemical Fertilizers in Agriculture at TG : పంటల సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తీరు ఏటా భారీగా పెరుగుతోంది. మొక్క మొలిచింది మొదలు, పూత పూసి కాయ కాసే కడవరకూ అంతా ఎరువులమయమవుతోంది! రైతులు ప్రతి సీజన్లో విత్తనాల కంటే ముందుగా ఎరువులే కొనుగోలు చేసి నిల్వ చేయటం చూస్తుంటే ఎంతలా వినియోగం ఉందో చెప్పకనే చెప్పవచ్చు. అటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా, కర్షకులు మాత్రం వాటి వాడకానికే మొగ్గు చూపుతున్నారు. | Read More
'మేము ఆ భూమి కొనలేదు - కుక్కల విద్యాసాగర్ ఇరికించారు' - ముంబయి సినీ నటి కేసులో కీలక మలుపు - Bollywood Actress Case Update
Bollywood Actress Case Update : ముంబయికి చెందిన సినీ నటి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు తమకు ఆమె భూమి అమ్మలేదని ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న నాగేశ్వరరాజు తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ ఆ కేసులో మమ్మల్ని ఇరికించారని, తమ పరువుకు భంగం కలిగించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. | Read More
నిజాయతీ కలిగిన బిల్డర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదు - ఆక్రమణలకు పాల్పడితే భయపడేలా చేస్తాం : హైడ్రా కమిషనర్ రంగనాథ్ - Hydra Commissioner Ranganath
Commissioner Ranganath about Hydra : కొద్ది రోజులు హడావిడి చేసి ఊరుకోవడం కాకుండా, ఎవరైనా ఆక్రమణలకు పాల్పడాలంటే భయపడేలా చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారని తెలిపిన రంగనాథ్, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్లోని ప్రతి అపార్ట్మెంట్ కూల్చాలనేది తమ ఉద్దేశం కాదన్నారు. వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిర్మాణాలను మాత్రమే నేలమట్టం చేస్తున్నామని హైదరాబాద్ వెస్ట్జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో రంగనాథ్ తెలిపారు. | Read More
రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 94 రైళ్లు రద్దు - 41 దారి మళ్లింపు - Trains Cancelled and Rescheduled
Trains Cancelled and Rescheduled: ఆధునికీకరణ పనులు కారణంగా సెప్టెంబరు నాలుగో వారం నుంచి పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అదే విధంగా కొన్ని రైళ్ల గమ్య స్థానాలను కుదించారు. రద్దైయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. | Read More
వెలుగులోకి మరో కుంభకోణం - ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో గోల్మాల్ - రూ.100 కోట్లు స్వాహా - Aarogyasri Bills Scam in AP
Aarogyasri Bills Scam in AP : గత సర్కార్ హయాంలో ఆరోగ్యశ్రీ ట్రస్టును అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. అందులో పనిచేసే సిబ్బందే భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లింపుల సమయంలో దాదాపు రూ.100 కోట్లను కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వ తనిఖీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీకి అంటకాగిన వారే దోపిడీకి సూత్రధారులుగా తెలుస్తోంది. | Read More
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు - Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలన్నారు. | Read More
స్టోన్క్రషర్లపై జగన్ మార్క్ మోసం - రాయల్టీ పోటుతో మూతపడుతున్న పరిశ్రమలు - Royalty Charges on Stone Crushers
Royalty Charges on Stone Crushers : వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వాకంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్టోన్క్రషర్లు మూతపడి వందలాది కార్మికులకు ఉపాధి కరవైన పరిస్ధితి నెలకొంది. గత ప్రభుత్వం రాయల్టీ వసూలు చేయడం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయని యజమానులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి రాయల్టీని రద్దు చేయాలని కోరుతున్నారు. | Read More
రహస్య కెమెరాల ప్రచారం - వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కొనసాగుతున్న దర్యాప్తు - Engineering College Issue
Gudlavalleru Engineering College Issue: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఎస్ఆర్జీఈసీ కళాశాలలోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలున్నట్లు జరిగిన ప్రచారంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం తేల్చే వరకు వసతి గృహంలోకి వెళ్లలేమని కళాశాల ముందు విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ కళాశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. ఘటనపై విచారణకు గుడివాడ సీసీఎస్ సీఐ నేతృత్వంలో కమిటీ వేశారు. హాస్టళ్లలో తనిఖీలు చేసిన విచారణ కమిటీ విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. | Read More
ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు - ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి - MUMBAI ACTRESS CASE
MUMBAI ACTRESS CASE: వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబయి నటి విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడించారు. తనపై కేసు నమోదుకు ముందే ముంబయిలో రెక్కీ నిర్వహించారన్న ఆమె ఆ తర్వాతే విద్యాసాగర్తో ఫిర్యాదు ఇప్పించి తనపై కేసు పెట్టారని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ముంబయిలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. | Read More