AP Assembly Budget Session 2024 :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు శాసనసభకు చేరుకున్నారు. చంద్రబాబు అధ్యక్షతన శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-25 వార్షిక బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ ముగిసింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
అంతకుముందు గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నాయుడు నాయుడు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేశ్, పార్థసారథి, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, సవిత, టీటీడీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. రాజధాని అమరావతి రైతులను నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ రైతులను అభినందించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని తెలుగుదేశం నేతలు తెలిపారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై చర్చించేందుకైనా దమ్ముంటే ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావాలంటూ ఆ పార్టీ నేతలు సవాల్ చేశారు.