తెలంగాణ

telangana

ఉచిత బస్సు కాదు - మహిళలకు రక్షణ కావాలి : షాద్‌నగర్‌ ఘటనపై శ్రీనివాస్‌ గౌడ్ - BRS on Shadnagar Incident

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 5:26 PM IST

Updated : Aug 5, 2024, 6:36 PM IST

Srinivas Goud Reacted to Shadnagar Incident : షాద్‌నగర్​లో మహిళపై దాడి అతి దుర్మార్గమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నేరం అంగీకరించాలంటూ దళిత మహిళను పోలీసులు హింసించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన, ముఖ్యమంత్రి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

Srinivas Goud
Srinivas Goud Reacted to Shadnagar Incident (ETV Bharat)

Srinivas Goud on Shadnagar Incident : మహిళలకు కేవలం ఉచిత బస్సు ఇచ్చి సంతోషపడమంటే ఎలా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ, ఆత్మ గౌరవం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు భయపడే పరిస్థితి ఉండేలా శాంతిభద్రతలు ఉన్నాయని, షాద్‌నగర్‌లో మహిళపై దాడి అతి దుర్మార్గమని ఆక్షేపించారు. యథా రాజా - తథా ప్రజ అన్నట్లు జరుగుతోందని మండిపడ్డారు. నేరం అంగీకరించాలని ఒక దళిత మహిళను పోలీసులే దారుణంగా హింసిస్తే ఎలా? ఇంకా ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు.

హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. నేరాల రేటు పెరిగితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, పర్యాటకులు ఎవరు వస్తారని అడిగారు. రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, చెప్పుకోవడానికి సిగ్గు వేస్తోందని వ్యాఖ్యానించారు. జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వ వైఫల్యంగానే చూస్తున్నామన్న ఆయన, ప్రభుత్వ విధానాలతో అందరూ బెదిరింపుల విషయంలో పోటీ పడుతున్నారని ఆరోపించారు.

షాద్​నగర్​లో మహిళపై పోలీసుల దాడి - తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ - Ktr Tweet On Dalit Woman Incident

మహిళలకు ఫ్రీ బస్సు కాదు, రక్షణ, ఆత్మ గౌరవం కావాలి. రాష్ట్రంలో ప్రజలు భయపడుతూ బతికేలా పరిస్థితులు ఉన్నాయి. షాద్‌నగర్‌లో మహిళపై దాడి అతి దుర్మార్గం. యథా రాజా - తథా ప్రజ అన్నట్లు ఉంది. నేరం అంగీకరించాలని పోలీసులే దళిత మహిళను దారుణంగా హింసిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి. సీఎం రేవంత్‌ రెడ్డి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష చేయాలి. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా చూడాలి. - శ్రీనివాస్‌ గౌడ్, మాజీ మంత్రి

అభివృద్దిపై దృష్టి సారించాలి కానీ క్షక సాధింపులు, అనవసర వేధింపులపై కాదని శ్రీనివాస్‌ గౌడ్‌ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష చేయాలని, తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా చూడాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. భారత రాష్ట్ర సమితి హయాంలో ఒక ఘటన జరిగితే ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకునేదని గుర్తు చేశారు. వరుస ఘటనల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ తరఫున ఒక కార్యాచరణ చేపడతామని తెలిపారు.

దళిత మహిళపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి - సమగ్ర విచారణకు ఆదేశం - SHADNAGAR DALIT WOMAN TORTURE CASE

Last Updated : Aug 5, 2024, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details