ETV Bharat / state

చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని రక్షించిన పోలీసులు - telagana varthalu

ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు డయల్​ 100కి ఫోన్​ చేసి చెప్పడం వల్ల పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని రక్షించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలో చోటుచేసుకుంది.

చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని రక్షించిన పోలీసులు
చాకచక్యంగా వ్యవహరించి యువకుడిని రక్షించిన పోలీసులు
author img

By

Published : Jan 26, 2021, 8:38 AM IST

తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డయల్​ 100కి కాల్ చేసి చెప్పడం వల్ల చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడిని కాపాడారు భువనగిరి పోలీసులు. ఫోన్​లో మాట్లాడుతూనే తాను ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో పాటు ఆ మార్గంలో వస్తున్న గూడ్స్​ రైలు లోకోపైలెట్​ను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని హుస్నాబాద్​కి చెందిన ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్​పై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని డయల్ 100కి ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే డయల్ 100 సిబ్బంది సదరు వ్యక్తితో మాట్లాడుతూనే భువనగిరి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రామారావు, హోంగార్డ్ శ్రీనివాసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో గూడ్స్ రైలు లోకో పైలెట్​ను అప్రమత్తం చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. అనంతరం యువకుడికి ఎస్సై వినోద్ కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రామారావు, శ్రీనివాసులును రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.

తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని డయల్​ 100కి కాల్ చేసి చెప్పడం వల్ల చాకచక్యంగా వ్యవహరించి ఓ యువకుడిని కాపాడారు భువనగిరి పోలీసులు. ఫోన్​లో మాట్లాడుతూనే తాను ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో పాటు ఆ మార్గంలో వస్తున్న గూడ్స్​ రైలు లోకోపైలెట్​ను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని హుస్నాబాద్​కి చెందిన ఓ యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్వే ట్రాక్​పై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని డయల్ 100కి ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే డయల్ 100 సిబ్బంది సదరు వ్యక్తితో మాట్లాడుతూనే భువనగిరి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రామారావు, హోంగార్డ్ శ్రీనివాసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి చాకచక్యంగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో గూడ్స్ రైలు లోకో పైలెట్​ను అప్రమత్తం చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు. అనంతరం యువకుడికి ఎస్సై వినోద్ కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు రామారావు, శ్రీనివాసులును రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో నేరం చేస్తే.. తప్పించుకోవడం కష్టమే సుమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.