రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు పాక్షిక లాక్డౌన్ విధించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని.. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు సత్యనారాయణ తెలిపారు. అందరూ మాస్కులు ధరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గుర్రం మోహన్ రెడ్డి, బుంగపట్ర కృష్ణ, గౌరు చంద్రశేఖర్, సకినాల వెంకటయ్య, గౌరు శ్రీనివాస్ కళ్లెం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!