ETV Bharat / state

మోత్కూరులో నేటి నుంచి పాక్షిక లాక్​డౌన్ - తెలంగాణ వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి పాక్షిక లాక్​డౌన్​ విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని.. కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు సత్యనారాయణ తెలిపారు.

Partial lock down, Mothkur
Partial lock down, Mothkur
author img

By

Published : May 9, 2021, 6:58 PM IST

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు పాక్షిక లాక్​డౌన్​ విధించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని.. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు సత్యనారాయణ తెలిపారు. అందరూ మాస్కులు ధరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గుర్రం మోహన్ రెడ్డి, బుంగపట్ర కృష్ణ, గౌరు చంద్రశేఖర్, సకినాల వెంకటయ్య, గౌరు శ్రీనివాస్ కళ్లెం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు పాక్షిక లాక్​డౌన్​ విధించారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే దుకాణాలు తెరచి ఉంటాయని.. వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలని కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు సత్యనారాయణ తెలిపారు. అందరూ మాస్కులు ధరిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గుర్రం మోహన్ రెడ్డి, బుంగపట్ర కృష్ణ, గౌరు చంద్రశేఖర్, సకినాల వెంకటయ్య, గౌరు శ్రీనివాస్ కళ్లెం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పుచ్చకాయ వ్యాపారాలపై కరోనా పిడుగు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.