ETV Bharat / state

పర్వతారోహణలో సత్తా చాటుతున్న అన్వితా రెడ్డి

author img

By

Published : Feb 14, 2021, 5:31 PM IST

Updated : Feb 14, 2021, 6:08 PM IST

ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది యాదాద్రి భువనగిరికి చెందిన పడమటి అన్వితా రెడ్డి. ఇటీవలె ఆఫ్రికాలోనే ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతం అధిరోహించింది. ఈ ఏడాదిలో 5 అంతర్జాతీయ సమ్మిట్స్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటోంది.

anvithareddy performing in rock climbing
పర్వాతారోహణలో సత్తా చాటుతున్న అన్వితా రెడ్డి
పర్వతారోహణలో సత్తా చాటుతున్న అన్వితా రెడ్డి

భువనగిరి రాక్‌ క్లైంబింగ్ శిక్షణా కేంద్రంలో పర్వతారోహణలో ఓనమాలు నేర్చుకుని ప్రస్తుతం శిక్షకురాలిగా పనిచేస్తోంది అన్వితా రెడ్డి. ఎంతో మంది ఔత్సహిక యువతీ, యువకులకు మెళకువలు నేర్పిస్తూనే... అడ్వాన్స్‌డ్‌ కోర్సులను పూర్తి చేసింది. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో మొదటి మహిళా శిక్షకురాలిగానే కాకుండా రాష్ట్రంలోనే పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ మహిళ శిక్షకురాలిగా గుర్తింపు పొందింది. గతనెల 21న ఆఫ్రికాలోనే ఎత్తైన శిఖరం కిలిమాంజారో అధిరోహణకు వెళ్లింది. స్పాన్సర్స్‌ ముందుకు వచ్చి సహాయం చేస్తే మరిన్ని సాహసాలు చేస్తానని అన్వితా రెడ్డి వెల్లడిస్తోంది.

చిన్నప్పటి నుంచి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన అన్వితారెడ్డికి చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింత ఆసక్తి పెరిగింది. పర్వతారోహణ చేయాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, సామగ్రి, ఆహారపదార్థాలు మోసుకెళ్లటం లాంటి సవాళ్లను తట్టుకోవాలి. స్పాన్సర్లు దొరికితే 7 ఖండాల్లో 7 ఎతైన శిఖరాలు అధిరోహించాలనే తమ కుమార్తె కళ నెరవేరుతుందని అన్వితారెడ్డి తల్లి చెబుతోంది.

సంకల్పం ఉంటే

అమ్మాయిలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో రాక్ క్లైంబింగ్ స్కూల్‌కి వచ్చి ర్యాప్లింగ్, క్లైంబింగ్ చేయడానికి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అన్వితారెడ్డి ఉండటమేనని తోటి శిక్షకులు చెబుతున్నారు. పురుషులతో సమానంగా అన్వితారెడ్డి అన్ని రకాల సాహసాలు చేస్తుందని తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సాహస క్రీడలు చేయాలనే సంకల్పం ఉంటే పురుషులతో సమానంగా రాణించవచ్చని అన్వితారెడ్డి నిరూపిస్తోంది.

ఇదీ చూడండి: పొదుపులోనే కాదు... 'స్ఫూర్తి'తో ఉత్పత్తిలోనూ మేటి

పర్వతారోహణలో సత్తా చాటుతున్న అన్వితా రెడ్డి

భువనగిరి రాక్‌ క్లైంబింగ్ శిక్షణా కేంద్రంలో పర్వతారోహణలో ఓనమాలు నేర్చుకుని ప్రస్తుతం శిక్షకురాలిగా పనిచేస్తోంది అన్వితా రెడ్డి. ఎంతో మంది ఔత్సహిక యువతీ, యువకులకు మెళకువలు నేర్పిస్తూనే... అడ్వాన్స్‌డ్‌ కోర్సులను పూర్తి చేసింది. భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో మొదటి మహిళా శిక్షకురాలిగానే కాకుండా రాష్ట్రంలోనే పర్వతారోహణలో మొదటి ప్రొఫెషనల్ మహిళ శిక్షకురాలిగా గుర్తింపు పొందింది. గతనెల 21న ఆఫ్రికాలోనే ఎత్తైన శిఖరం కిలిమాంజారో అధిరోహణకు వెళ్లింది. స్పాన్సర్స్‌ ముందుకు వచ్చి సహాయం చేస్తే మరిన్ని సాహసాలు చేస్తానని అన్వితా రెడ్డి వెల్లడిస్తోంది.

చిన్నప్పటి నుంచి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లికి చెందిన అన్వితారెడ్డికి చిన్నప్పటి నుంచి సాహస క్రీడలంటే మక్కువ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింత ఆసక్తి పెరిగింది. పర్వతారోహణ చేయాలంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, సామగ్రి, ఆహారపదార్థాలు మోసుకెళ్లటం లాంటి సవాళ్లను తట్టుకోవాలి. స్పాన్సర్లు దొరికితే 7 ఖండాల్లో 7 ఎతైన శిఖరాలు అధిరోహించాలనే తమ కుమార్తె కళ నెరవేరుతుందని అన్వితారెడ్డి తల్లి చెబుతోంది.

సంకల్పం ఉంటే

అమ్మాయిలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో రాక్ క్లైంబింగ్ స్కూల్‌కి వచ్చి ర్యాప్లింగ్, క్లైంబింగ్ చేయడానికి వస్తున్నారంటే దానికి ప్రధాన కారణం అన్వితారెడ్డి ఉండటమేనని తోటి శిక్షకులు చెబుతున్నారు. పురుషులతో సమానంగా అన్వితారెడ్డి అన్ని రకాల సాహసాలు చేస్తుందని తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సాహస క్రీడలు చేయాలనే సంకల్పం ఉంటే పురుషులతో సమానంగా రాణించవచ్చని అన్వితారెడ్డి నిరూపిస్తోంది.

ఇదీ చూడండి: పొదుపులోనే కాదు... 'స్ఫూర్తి'తో ఉత్పత్తిలోనూ మేటి

Last Updated : Feb 14, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.