ETV Bharat / state

చేప పిల్లలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

గ్రామీణ స్థాయిలో ఆర్థికంగా కులవృత్తులను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ముదిరాజ్​లను ప్రోత్సహించేందుకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.

author img

By

Published : Aug 16, 2019, 11:36 AM IST

చేప పిల్లలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ అర్బన్ జిల్లాలో చేపట్టారు. జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ పెద్ద చెరువులో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి మంత్రి చేపపిల్లలను నీటిలోకి వదిలారు. రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదలడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఒక కోటి 30 లక్షల చేప పిల్లలకుగాను మడికొండలోని చెరువులు కుంటల్లో మూడు లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేపల అమ్మకానికి ముదిరాజ్, బెస్త కులస్తులకు ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని అన్నారు. వర్షాలు ఆలస్యమైనప్పటికీ జిల్లాలో దాదాపు 70 శాతం వరకు చెరువుల్లోకి నీరు వచ్చిందని, దేవాదుల ఎస్సారెస్పీ నీటి ద్వారా మిగిలిన అన్ని చెరువులను నీటితో నింపుతామని మంత్రి వివరించారు.

చేప పిల్లలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి : అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ అర్బన్ జిల్లాలో చేపట్టారు. జిల్లాలోని కాజీపేట మండలం మడికొండ పెద్ద చెరువులో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి మంత్రి చేపపిల్లలను నీటిలోకి వదిలారు. రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదలడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఒక కోటి 30 లక్షల చేప పిల్లలకుగాను మడికొండలోని చెరువులు కుంటల్లో మూడు లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చేపల అమ్మకానికి ముదిరాజ్, బెస్త కులస్తులకు ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని అన్నారు. వర్షాలు ఆలస్యమైనప్పటికీ జిల్లాలో దాదాపు 70 శాతం వరకు చెరువుల్లోకి నీరు వచ్చిందని, దేవాదుల ఎస్సారెస్పీ నీటి ద్వారా మిగిలిన అన్ని చెరువులను నీటితో నింపుతామని మంత్రి వివరించారు.

చేప పిల్లలు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి : అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

Intro:TG_WGL_11_16_CHEPA_PILLALU_PAMPINI_CHESINA_MANTHRI_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ పెద్ద చెరువులో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి మంత్రి చేపపిల్లలను నీటిలో వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 86 కోట్ల చేపపిల్లలను చెరువులలో వదలడానికి తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని... వరంగల్ జిల్లాలో 1 కోటి 30 లక్షల చేప పిల్లల కు గాను మడికొండ గ్రామంలోని చెరువులు కుంటలలో 3 లక్షల చేప పిల్లలను ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా చేపల అమ్మకానికి ముదిరాజ్, బెస్త కులస్తులకు ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. వర్షాలు ఆలస్యం అయినప్పటికీ జిల్లాలో దాదాపు 70 శాతం వరకు చెరువులలో నీరు వచ్చిందని దేవాదుల ఎస్సారెస్పీ నీటి ద్వారా మిగిలిన అన్ని చెరువులను నీటిలో నింపుతామని ఆయన తెలిపారు.

bytes...

ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి.
ఆరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION



Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.