ETV Bharat / state

దశదిన ఖర్మకు హాజరైన నటుడు అలీ

author img

By

Published : Mar 2, 2021, 11:03 PM IST

సూర్యాపేట జిల్లా రఘునాథపాలెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు మౌలాలి తండ్రి దశదిన ఖర్మకు నటుడు అలీ హాజరయ్యారు. అనారోగ్యంతో చనిపోయిన షేక్ జాన్​కు నివాళులర్పించారు. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.

Ali attends Dashadina Kharma function of his friend father
దశదిన ఖర్మకు హాజరయిన నటుడు అలీ

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల రఘునాధపాలెం గ్రామంలో తన స్నేహితుడైన మౌలాలి తండ్రి షేక్ జాన్ దశదిన ఖర్మ కార్యక్రమానికి సినీ నటుడు అలీ హాజరయ్యారు. అనారోగ్యంతో చనిపోయిన మిత్రుడి నాన్నకు నివాళులర్పించారు.

కార్యక్రమంలో అలీతోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. షేక్ జాన్ బొగ్గుల వ్యాపారం చేసేవారు. ఇతన్ని గ్రామంలో బొగ్గుల జానీగా పిలిచేవారు.

జాన్ కుమారుడు మౌలాలి.. ప్రవాస భారతీయుడు. లండన్​లో ఉద్యోగం చేస్తున్నాడు. నటుడు అలీ తన స్నేహితుడు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారని బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి: ఓలింగ నామస్మరణలతో మార్మోగుతున్న పెద్దగట్టు

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల రఘునాధపాలెం గ్రామంలో తన స్నేహితుడైన మౌలాలి తండ్రి షేక్ జాన్ దశదిన ఖర్మ కార్యక్రమానికి సినీ నటుడు అలీ హాజరయ్యారు. అనారోగ్యంతో చనిపోయిన మిత్రుడి నాన్నకు నివాళులర్పించారు.

కార్యక్రమంలో అలీతోపాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. షేక్ జాన్ బొగ్గుల వ్యాపారం చేసేవారు. ఇతన్ని గ్రామంలో బొగ్గుల జానీగా పిలిచేవారు.

జాన్ కుమారుడు మౌలాలి.. ప్రవాస భారతీయుడు. లండన్​లో ఉద్యోగం చేస్తున్నాడు. నటుడు అలీ తన స్నేహితుడు కావడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారని బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి: ఓలింగ నామస్మరణలతో మార్మోగుతున్న పెద్దగట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.