రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులతోమంత్రి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.
దేవాలయాన్ని అద్భుతంగా మారుస్తా
అమ్మవారి కృపతో మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి కేటాయించిన రూ. 50 కోట్లతో రెండేళ్లలోపు పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామన్నారు. ఆలయ పరిసరాలను పచ్చదనంతో సుదరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి