ఎన్నికల హామీల అమలులో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెదేపా అధికార ప్రతినిధి దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో నిర్వహించిన పార్లమెంటరీ విసృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ఐదు లక్షలు జమచేస్తే... స్థలాలు ఇప్పించే బాధ్యత తెదేపా తీసుకుంటుందన్నారు. తెరాస ప్రభుత్వం మరుగున పడేసిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో లోపాలను ఎండగట్టే విధంగా కార్యకర్తలను సన్నద్ధం చేస్తామని వెల్లడించారు. ఈనెల 29 తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని దయాకర్రెడ్డి తెలిపారు.