ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల వెన్నంటి ఉంటాం'

author img

By

Published : Oct 19, 2019, 6:48 PM IST

మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు బంద్ జరిగింది. బంద్​కు మద్దతుగా డోర్నకల్ నియోజకవర్గంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

'ఆర్టీసీ కార్మికుల వెన్నంటి ఉంటాం'

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ కొనసాగుతుంది. డోర్నకల్‌లో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూతపడ్డాయి. కురవిలో నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. వంతడపల స్టేజీ వద్ద వరంగల్‌-ఖమ్మం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'ఆర్టీసీ కార్మికుల వెన్నంటి ఉంటాం'

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ కొనసాగుతుంది. డోర్నకల్‌లో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూతపడ్డాయి. కురవిలో నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. వంతడపల స్టేజీ వద్ద వరంగల్‌-ఖమ్మం రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'ఆర్టీసీ కార్మికుల వెన్నంటి ఉంటాం'
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.