వర్షాన్ని లెక్కచేయకుండా కార్మికులు, జర్నలిస్టులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ఈ బిల్లు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర సంస్థలలో పనిచేస్తోన్న కార్మికులకు కనీస వేతనాలు జీవో ప్రకారం రోజుకు రూ.580 ఉండగా... అట్టడుగు కార్మికులకు కేంద్రప్రభుత్వం జాతీయ కనీస వేతనం రోజుకి రూ.178 లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు.
ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ