ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ సంస్థను ప్రైవేట్ పరం చేయడం సరైన నిర్ణయం కాదని ఎల్ఐసీ ఉద్యోగుల హైదరాబాద్ డివిజన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయంలో వాటాల ఉపసంహరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేశంలో రైల్వే తర్వాత అత్యధిక ఆస్తులు కలిగిన సంస్థ ఎల్ఐసీ అని పేర్కొన్నారు. ఎల్ఐసీ సంస్థను ప్రైవేట్ పరం చేయడం విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు