జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమృత సామాజిక, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. మహిళలు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు.
ఈ కేంద్రంలో నాలుగు నెలల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్నవారికి కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందేవారు ముందుగా రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని... వాటిని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.