ETV Bharat / state

దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు పెట్టిన రైతు - fire to crop

జగిత్యాల జిల్లా రాయికల్​ మండలం సింగరావుపేటలో ఓ రైతు తన నాలుగెకరాల పంటను కాల్చేశాడు. ప్రభుత్వం మాట విని సన్నాలు వేయగా... అకాల వర్షాలు, తెగుళ్లతో పంట మొత్తం పాడైపోయిందని ఆవేదనతో కాల్చేశాడు.

దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
దిగుబడి రాలేదని వరి పంటకు నిప్పు పెట్టిన రైతు
author img

By

Published : Nov 19, 2020, 10:34 AM IST

సన్న రకాల సాగు రైతులను నిండా ముంచింది. తెగుళ్లతో పాటు అకాల వర్షాల కారణంగా పంట పడిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేశం వేసిన నాలుగు ఎకరాల పంట పడిపోయింది. దిగుబడి రాలేదన్న మనస్తాపంతో పంట కాల్చి వేశాడు.

రైతుకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా... నాలుగు ఎకరాల్లో దొడ్డు రకాలు.... మరో నాలుగు ఎకరాల్లో సన్నాలు సాగు చేశాడు. పంటను తెగుళ్లు, అకాల వర్షాలు దెబ్బతీశాయని రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ చెప్పటం వల్లే సన్నాలు సాగు చేశానని రైతు తెలిపాడు. ప్రభుత్వం మాట విని తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: బల్దియా పోటీకి ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు?

సన్న రకాల సాగు రైతులను నిండా ముంచింది. తెగుళ్లతో పాటు అకాల వర్షాల కారణంగా పంట పడిపోయి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేశం వేసిన నాలుగు ఎకరాల పంట పడిపోయింది. దిగుబడి రాలేదన్న మనస్తాపంతో పంట కాల్చి వేశాడు.

రైతుకు ఎనిమిది ఎకరాల భూమి ఉండగా... నాలుగు ఎకరాల్లో దొడ్డు రకాలు.... మరో నాలుగు ఎకరాల్లో సన్నాలు సాగు చేశాడు. పంటను తెగుళ్లు, అకాల వర్షాలు దెబ్బతీశాయని రాజేశం ఆవేదన వ్యక్తం చేశాడు. సీఎం కేసీఆర్ చెప్పటం వల్లే సన్నాలు సాగు చేశానని రైతు తెలిపాడు. ప్రభుత్వం మాట విని తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: బల్దియా పోటీకి ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.