ETV Bharat / state

విజయవాడ కనకదుర్గ గుడి వెబ్​సైట్​ నిలిపివేత

author img

By

Published : Mar 25, 2021, 9:22 AM IST

ఏపీ, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వెబ్​సైట్​ను నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌ను నిలిపివేసినట్లు ఆలయ ఈవో సురేశ్‌బాబు తెలిపారు.

vijayawada-kanaka-durgagudi-website-shutdown-in-krishna-district
విజయవాడ కనకదుర్గ గుడి వెబ్​సైట్​ నిలిపివేత

ఏపీ, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వెబ్‌సైట్‌ను ఆకస్మికంగా నిలిపివేయడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. గత నెలలో.. శ్రీశైలం దేవస్థానంలో ప్రైవేటు సంస్థ నిర్వహణలో ఏర్పాటు చేసిన దర్శనం టిక్కెట్ల బుకింగ్‌లో గోల్‌మాల్‌ జరగింది. ఆ నేపథ్యంలో.. దేవాదాయశాఖ, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నిర్వహణపై ఆరా తీసింది.

ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే వెబ్‌సైట్లను నిలిపివేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గ గుడి వెబ్‌సైట్‌ను 2017లో అప్పటి ఈవో సూర్యకుమారి విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. అప్పటి నుంచి ఆ సంస్థ.. ఆన్‌లైన్లో డొనేషన్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించిన సేవలను భక్తులకు అందిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ దేవస్థానానికి ఉచిత సేవలనందించారు.

దేవాదాయశాఖ.. ప్రస్తుతం టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా మాత్రమే భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించింది. అయితే టీఎంఎస్‌ ద్వారా ప్రస్తుతం.. దేవాలయాల్లో మాత్రమే దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవలు అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆర్జిత సేవలు, డొనేషన్లు ఇవ్వడానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే వెబ్‌సైట్‌ను నిలిపివేయడంతో దుర్గగుడికి రోజుకు రూ. 20 లక్షల ఆదాయానికి గండిపడుతుంది. ఈ విషయంపై ఈవో సురేశ్‌‌బాబును సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో టీఎంఎస్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు

ఏపీ, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వెబ్‌సైట్‌ను ఆకస్మికంగా నిలిపివేయడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. గత నెలలో.. శ్రీశైలం దేవస్థానంలో ప్రైవేటు సంస్థ నిర్వహణలో ఏర్పాటు చేసిన దర్శనం టిక్కెట్ల బుకింగ్‌లో గోల్‌మాల్‌ జరగింది. ఆ నేపథ్యంలో.. దేవాదాయశాఖ, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నిర్వహణపై ఆరా తీసింది.

ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే వెబ్‌సైట్లను నిలిపివేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గ గుడి వెబ్‌సైట్‌ను 2017లో అప్పటి ఈవో సూర్యకుమారి విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. అప్పటి నుంచి ఆ సంస్థ.. ఆన్‌లైన్లో డొనేషన్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించిన సేవలను భక్తులకు అందిస్తున్నారు. కొవిడ్‌ సమయంలోనూ దేవస్థానానికి ఉచిత సేవలనందించారు.

దేవాదాయశాఖ.. ప్రస్తుతం టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా మాత్రమే భక్తులకు సేవలు అందించాలని నిర్ణయించింది. అయితే టీఎంఎస్‌ ద్వారా ప్రస్తుతం.. దేవాలయాల్లో మాత్రమే దర్శనం టిక్కెట్లు, ఆర్జిత సేవలు అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆర్జిత సేవలు, డొనేషన్లు ఇవ్వడానికి సరైన వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే వెబ్‌సైట్‌ను నిలిపివేయడంతో దుర్గగుడికి రోజుకు రూ. 20 లక్షల ఆదాయానికి గండిపడుతుంది. ఈ విషయంపై ఈవో సురేశ్‌‌బాబును సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో టీఎంఎస్‌ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.