ఏపీ, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ వెబ్సైట్ను ఆకస్మికంగా నిలిపివేయడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. గత నెలలో.. శ్రీశైలం దేవస్థానంలో ప్రైవేటు సంస్థ నిర్వహణలో ఏర్పాటు చేసిన దర్శనం టిక్కెట్ల బుకింగ్లో గోల్మాల్ జరగింది. ఆ నేపథ్యంలో.. దేవాదాయశాఖ, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నిర్వహణపై ఆరా తీసింది.
ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే వెబ్సైట్లను నిలిపివేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కనకదుర్గ గుడి వెబ్సైట్ను 2017లో అప్పటి ఈవో సూర్యకుమారి విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పజెప్పారు. అప్పటి నుంచి ఆ సంస్థ.. ఆన్లైన్లో డొనేషన్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల కొనుగోలుకు సంబంధించిన సేవలను భక్తులకు అందిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ దేవస్థానానికి ఉచిత సేవలనందించారు.