రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. షాది ముభారక్, రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, చిన్న అంజయ్య నగర్లో ముస్లింలకు రంజాన్ తోఫా బట్టల బ్యాగులను రంజిత్ రెడ్డి పంపిణీ చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బిలాల్ మజీద్ అధ్యక్షుడు బాబర్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నోరూరిస్తున్న తెలంగాణ ప్రత్యేక వంటకాలు