రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 4,150 మెగావాట్లకు తగ్గిపోయింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు అతి తక్కువ డిమాండ్ ఏర్పడినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇంత తక్కువ కరెంట్ను వినియోగించడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. వాస్తవానికి వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్తో ప్రజలు ఇంటికే పరిమితం అయినప్పటికీ... ఫ్యాన్లు, టీవీలు నిర్విరామంగా నడుస్తున్నా.. రబీ సీజన్ ముగియడం, పరిశ్రమలు మూతపడటం వల్ల కరెంట్ వినియోగంలో మార్పులు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ