ETV Bharat / state

నిజాం కాలం నాటి రైలుబండి... ఒకసారి చూసొద్దాం రండి

రైలు అనగానే మనకు గుర్తొచ్చేది చుక్... చుక్... అంటూ వచ్చే శబ్దం, దాని వెంట దట్టమైన పొగ. ఇదంతా ఒకప్పుడు... ఇప్పటి రైళ్ళు అలా ఏమీ లేవుకదా అనుకుంటున్నారా? లేదండీ... ఇప్పటికీ ఆ పాతకాలం రైళ్లను చూడొచ్చు. దానికోసం హైదరాబాద్​లోని రైల్ నిలయం దగ్గరకు వెళ్తే సరిపోతుంది.

author img

By

Published : Mar 20, 2019, 7:56 PM IST

రైలు బండి.. రైలు బండి... అదిరిపోయే రైలుబండి
రైలు బండి.. రైలు బండి... అదిరిపోయే రైలుబండి
నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్-వాడీ మధ్య ప్రారంభమైన మార్గంలో ఈ రైలు పరుగులు పెట్టింది. ఈ రైలు పేరు అలెక్ లోకోమోటివ్. ఇంగ్లాండ్ కు చెందిన కిట్సన్ అండ్ కో కంపెనీ 1907లో రూపొందించింది. బార్సీ లైట్ రైల్వే న్యారో గేజ్ సిస్టంలో దీన్ని వినియోగించారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలో విలీనమైంది. కొన్ని దశాబ్దాల సేవల అనంతరం దీన్ని ఉపసంహరించారు. ఆ తర్వాత షెడ్డుకే పరిమితమైంది. చాలా రోజులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించి దీనిని కొత్తగా ముస్తాబు చేశారు.

ఆ రైలును ఎప్పుడెప్పుడు చూడొచ్చు?

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం"రైల్‌ నిలయం" ఎదుట ఈ ఇంజన్ ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న మరమ్మత్తులు చేసి శబ్దం వినిపించేలా, ఆవిరి పొగ వచ్చేలా మార్చేశారు. అంతే కాకుండా ఇంజిను పైన భారీ లైటు యథావిధిగా వెలుగుతుంది. ముందువైపు నక్షత్రం గుర్తును ప్రత్యేకంగా మలిచారు. ఇది చూసినవారికి కొన్ని దశాబ్దాల క్రితం చూసిన అనుభూతి కలిగేలా చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు దీనిని పనిచేసేలా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ రైలును చూసేందుకు చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. ఇంజిను ముందు నిల్చొని స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు. సాయంత్రం సమయంలో ప్రత్యేక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో వర్ణశోభితమైన వెలుగుల్లో మరింత అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తుంది.

రైల్వే శాఖ పాత రైళ్లను కాపాడటం పట్ల పర్యటకులు, నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:ప్రధాని కార్యాలయం కాదది.. ప్రచారాల నిలయం​:రాహుల్

రైలు బండి.. రైలు బండి... అదిరిపోయే రైలుబండి
నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా సికింద్రాబాద్-వాడీ మధ్య ప్రారంభమైన మార్గంలో ఈ రైలు పరుగులు పెట్టింది. ఈ రైలు పేరు అలెక్ లోకోమోటివ్. ఇంగ్లాండ్ కు చెందిన కిట్సన్ అండ్ కో కంపెనీ 1907లో రూపొందించింది. బార్సీ లైట్ రైల్వే న్యారో గేజ్ సిస్టంలో దీన్ని వినియోగించారు. ఆ తర్వాత భారతీయ రైల్వేలో విలీనమైంది. కొన్ని దశాబ్దాల సేవల అనంతరం దీన్ని ఉపసంహరించారు. ఆ తర్వాత షెడ్డుకే పరిమితమైంది. చాలా రోజులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించి దీనిని కొత్తగా ముస్తాబు చేశారు.

ఆ రైలును ఎప్పుడెప్పుడు చూడొచ్చు?

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆవిర్భవించాక దాని కేంద్ర కార్యాలయం"రైల్‌ నిలయం" ఎదుట ఈ ఇంజన్ ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న మరమ్మత్తులు చేసి శబ్దం వినిపించేలా, ఆవిరి పొగ వచ్చేలా మార్చేశారు. అంతే కాకుండా ఇంజిను పైన భారీ లైటు యథావిధిగా వెలుగుతుంది. ముందువైపు నక్షత్రం గుర్తును ప్రత్యేకంగా మలిచారు. ఇది చూసినవారికి కొన్ని దశాబ్దాల క్రితం చూసిన అనుభూతి కలిగేలా చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు దీనిని పనిచేసేలా రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

ఈ రైలును చూసేందుకు చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు. ఇంజిను ముందు నిల్చొని స్వీయ చిత్రాలు తీసుకుంటున్నారు. సాయంత్రం సమయంలో ప్రత్యేక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో వర్ణశోభితమైన వెలుగుల్లో మరింత అందంగా, ఆకర్షణీయంగా కన్పిస్తుంది.

రైల్వే శాఖ పాత రైళ్లను కాపాడటం పట్ల పర్యటకులు, నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:ప్రధాని కార్యాలయం కాదది.. ప్రచారాల నిలయం​:రాహుల్

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.