ETV Bharat / state

రాహుల్​ సభపై భేటీ

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో గాంధీభవన్​లో టీకాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. జనసమీకరణ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

author img

By

Published : Mar 6, 2019, 2:02 PM IST

గాంధీభవన్​లో టీకాంగ్రెస్ నేతలు

ఈనెల 9న రాహుల్​గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ అయ్యారు. కనీస వాగ్దాన సభ కోసం జన సమీకరణ, సౌకర్యాల కల్పనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్‌సభ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో టీకాంగ్రెస్ నేతల భేటీ

ఇవీ చూడండి:నిజామాబాద్​కు అమిత్​షా

ఈనెల 9న రాహుల్​గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ అయ్యారు. కనీస వాగ్దాన సభ కోసం జన సమీకరణ, సౌకర్యాల కల్పనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్‌సభ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో టీకాంగ్రెస్ నేతల భేటీ

ఇవీ చూడండి:నిజామాబాద్​కు అమిత్​షా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.