ఈనెల 9న రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన భేటీ అయ్యారు. కనీస వాగ్దాన సభ కోసం జన సమీకరణ, సౌకర్యాల కల్పనపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, లోక్సభ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:నిజామాబాద్కు అమిత్షా