రాష్ట్రంలో 57 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారులు(డీసీఈవో)గా పదోన్నతులు కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగులు ఇచ్చేవరకు వారిని కొత్త హోదాలో ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగాలని ఆదేశించింది. ఈ పదోన్నతులకు సీఎం కేసీఆర్ సోమవారం రాత్రే ఆమోదం తెలిపారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
18 మంది సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు(గ్రేడ్-2)గా పదోన్నతులు కల్పిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం జరిగిన శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) సమావేశం రాష్ట్ర సచివాలయంలో 120 మంది, వైద్య ఆరోగ్య శాఖలో 30 మంది పదోన్నతులకు ఆమోదం తెలిపింది. వీటిపై బుధవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి.
ఇదీ చదవండి: CM KCR: మూడు రోజులు దిల్లీలోనే కేసీఆర్.. నేడే పయనం.. అందుకేనా?