తెల్లవారుజామున ముళ్ల పొదల నుంచి వస్తున్న పసికందు ఏడుపు విన్న ఏపీలోని చిత్తూరు జిల్లా బి.కొత్తకోట గ్రామస్థులు స్థానిక అంగన్వాడి కార్యాకర్తకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా పుట్టి ఒక్క రోజైనా గడవని ఓ ఆడశిశువు ఏడుస్తూ ఉండటంతో హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మదనపల్లె ఐసీడీఎస్ అధికారిని సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యవంతంగానే ఉందనీ, ముళ్ల పొదల్లో వేయటం వలన చిన్న గాయమైందని తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి చిత్తూరు జిల్లాలో శిశు సంరక్షణ శాలకు శిశువు తరలిస్తామని ఆమె వివరించారు.
ఇదీ చూడండి : ఎమర్జెన్సీ వార్డులో వరదనీరు