ETV Bharat / state

ప్రారంభమైన జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన

మరో జాతీయ ప్రదర్శనకు భాగ్యనగరం వేదికైంది. జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శనను ఉద్యాన శాఖ కమిషనర్​ లోక వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. తదితర రాష్ట్రాల నుంచి 100కు పైగా స్టాళ్లు ఈ ప్రదర్శనలో కొలువు తీరాయి.

author img

By

Published : Jan 23, 2020, 5:53 PM IST

Updated : Jan 23, 2020, 7:45 PM IST

grand nursery mela launched in hyderabadgrand nursery mela launched in hyderabad
ప్రారంభమైన జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన
ప్రారంభమైన జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన

భాగ్యనగరంలో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ - టీఈఓ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. 8వ అఖిల భారత మేళాను ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఉద్యాన శాఖ సహకారంతో పూర్తి ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రదర్శనకు సందర్శకుల రాక మొదలైంది.

తరలివస్తున్న నగరవాసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి 100 పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. దేశంలో పేరెన్నికగన్న నర్సరీలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. రసాయన అవశేషాలు ఆహారానికి ప్రత్యామ్నాయంగా అవగాహన కల్పనకు సేంద్రీయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆహారం పదార్థాలు అందుబాటులో పెట్టిన దృష్ట్యా తిలకించేందుకు నగరవాసులు తరలివస్తున్నారు.

అందమైన మెుక్కలు, విక్రయాలు

ఇళ్లు, కార్యాలయాలు అందంగా అలంకరించుకునేందుకు వర్టికల్‌ గార్డెన్‌ కోసం అందమైన మొక్కల ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు. కోటి జనాభా గల నగరంలో బహుళ అంతస్తుల భవనాలపై, బాల్కనీల్లో ప్రతి ఒక్కరూ కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవాలని కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్నారు. జంట నగరవాసులు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన సందర్శించి నగరసేద్యానికి అవసరమైన మొక్కలు, విత్తనాలు, పరికరాలు కొనుగోలు చేసి సొంత ఇంటి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ఇవీ చూడండి: 'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'

ప్రారంభమైన జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన

భాగ్యనగరంలో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ - టీఈఓ ఆధ్వర్యంలో జరుగనున్నాయి. 8వ అఖిల భారత మేళాను ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఉద్యాన శాఖ సహకారంతో పూర్తి ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రదర్శనకు సందర్శకుల రాక మొదలైంది.

తరలివస్తున్న నగరవాసులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి 100 పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. దేశంలో పేరెన్నికగన్న నర్సరీలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. రసాయన అవశేషాలు ఆహారానికి ప్రత్యామ్నాయంగా అవగాహన కల్పనకు సేంద్రీయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆహారం పదార్థాలు అందుబాటులో పెట్టిన దృష్ట్యా తిలకించేందుకు నగరవాసులు తరలివస్తున్నారు.

అందమైన మెుక్కలు, విక్రయాలు

ఇళ్లు, కార్యాలయాలు అందంగా అలంకరించుకునేందుకు వర్టికల్‌ గార్డెన్‌ కోసం అందమైన మొక్కల ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు. కోటి జనాభా గల నగరంలో బహుళ అంతస్తుల భవనాలపై, బాల్కనీల్లో ప్రతి ఒక్కరూ కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవాలని కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్నారు. జంట నగరవాసులు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన సందర్శించి నగరసేద్యానికి అవసరమైన మొక్కలు, విత్తనాలు, పరికరాలు కొనుగోలు చేసి సొంత ఇంటి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

ఇవీ చూడండి: 'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'

23-01-2020 TG_HYD_29_23_GRAND_NURSARY_MELA_LAUNCH_AB_3038200 REPORTER : MALLIK.B CAM : DEVENDER ( ) హైదరాబాద్‌లో జాతీయ ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ - టీఈఓ ఆధ్వర్యంలో జరుగనున్న 8వ అఖిల భారత మేళాను ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఉద్యాన శాఖ సహకారంతో పూర్తి ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రదర్శనకు సందర్శకుల రాక మొదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి 100 పైగా స్టాళ్లు ప్రదర్శనలో కొలువు తీరాయి. దేశంలో పేరెన్నికగన్న నర్సరీలు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాయి. సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించేలా విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, జీవ ఎరువులు, విభిన్న వందల రకాలైన పూలు, పండ్ల మొక్కలు, అంట్లు, కుండీలు, ఇతర అలంకర మొక్కలు ప్రదర్శిస్తున్నారు. రసాయన అవశేషాలు ఆహారానికి ప్రత్యామ్నాయంగా అవగాహన కల్పనకు సేంద్రీయ ఉత్పత్తులు, చిరుధాన్యాలు, ఆహారం పదార్థాలు అందుబాటులో పెట్టిన దృష్ట్యా తిలకించేందుకు నగరవాసులు తరలివస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు అందంగా అలంకరించుకునేందుకు వర్టికల్‌ గార్డెన్‌ కోసం అందమైన మొక్కల ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు. కోటి జనాభాగల నగరంలో బహుళ అంతస్తుల భనవాలు, డాబాలపై, బాల్కనీల్లో ప్రతి ఒక్కరూ కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం ద్వారా చక్కటి ఆక్సీజన్ ఉత్పత్తి చేసుకోవాలని కమిషనర్ వెంకటరామిరెడ్డి అన్నారు. జంట నగరవాసులు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన సందర్శించి నగరసేద్యానికి అవసరమైన మొక్కలు, విత్తనాలు, పరికరాలు కొనుగోలు చేసి సొంత ఇంటి పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని... అందుకోసం ఉద్యాన శాఖ 50 శాతం రాయితీపై ఆ సామగ్రి సమకూరుస్తుందని ప్రకటించారు. VIS........BYTES.......... లోక వెంకటరామిరెడ్డి, కమిషనర్, ఉద్యాన శాఖ
Last Updated : Jan 23, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.