ETV Bharat / state

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?' - ఏపీ ముఖ్యమంత్రి జగన్​ఫై చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఏ ఒక్కరిదో కాదని.. ఇది రాష్ట్ర ప్రజలందరి బాధ్యతని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆందోళనల్లో రైతులు చనిపోతే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అమరావతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. మూడు రాజధానులు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'
'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'
author img

By

Published : Jan 6, 2020, 4:14 PM IST

Updated : Jan 6, 2020, 4:27 PM IST

ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. 20 రోజులుగా అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలుపుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అమరావతికి జరుగుతున్న అన్యాయంపై పార్టీల నేతలంతా గళమెత్తాలని పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రజాభిప్రాయం చెప్పేవారికి పోలీసులు అడ్డు రాకూడదని హితవు పలికారు. ధర్నాలు చేసే వారందరినీ జైల్లో పెడితే.. మొత్తం జైళ్లన్నీ సరిపోవని పేర్కొన్నారు. నిరసన తెలిపితే ఎంత మందిపై కేసులు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రులు బయటకు వచ్చి అమరావతికి మద్దతివ్వాలని కోరారు.

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'

భావితరాల భవిష్యత్తు అమరావతి

అమరావతి భావితరాల భవిష్యత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విద్యార్థులు కేసులకు భయపడి వెనుకడుగు వేయవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కాకుండా.. అభివృద్ధినే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే ప్రజలు మరింత రెచ్చిపోతారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'

ఇదీ చూడండి:

కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం లేనిపోని సమస్యలు సృష్టిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. 20 రోజులుగా అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తెలుపుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అమరావతికి జరుగుతున్న అన్యాయంపై పార్టీల నేతలంతా గళమెత్తాలని పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రజాభిప్రాయం చెప్పేవారికి పోలీసులు అడ్డు రాకూడదని హితవు పలికారు. ధర్నాలు చేసే వారందరినీ జైల్లో పెడితే.. మొత్తం జైళ్లన్నీ సరిపోవని పేర్కొన్నారు. నిరసన తెలిపితే ఎంత మందిపై కేసులు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రులు బయటకు వచ్చి అమరావతికి మద్దతివ్వాలని కోరారు.

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'

భావితరాల భవిష్యత్తు అమరావతి

అమరావతి భావితరాల భవిష్యత్తు అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విద్యార్థులు కేసులకు భయపడి వెనుకడుగు వేయవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కాకుండా.. అభివృద్ధినే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలను అణచి వేయాలని చూస్తే ప్రజలు మరింత రెచ్చిపోతారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

'ఆందోళనల్లో రైతులు చనిపోతే ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోడా?'

ఇదీ చూడండి:

కమిటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: చంద్రబాబు

Last Updated : Jan 6, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.