ETV Bharat / sports

'డేవిస్​ కప్​లో ఆడుతున్నా... నేనే సారథిని'

author img

By

Published : Nov 6, 2019, 2:03 PM IST

డేవిస్​ కప్​లో పాక్​తో మ్యాచ్​లకు తనే కెప్టెన్‌గా ఉన్నట్లు చెప్పాడు మహేశ్​ భూపతి. సోమవారం భూపతి స్థానంలో రోహిత్​ రాజ్​పాల్​ను నాన్​ ప్లేయింగ్​ కెప్టెన్​గా అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) నియమించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తనకు ఇంకా సమాచారం అందలేదని చెప్పాడు భూపతి.

'డెవిస్​ కప్​లో ఆడుతున్నా... నేనే సారథిగా ఉంటా'

పాకిస్థాన్‌తో డేవిస్‌ కప్‌ పోరుకు తనే కెప్టెన్​గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు సీనియర్​ టెన్నిస్​ క్రీడాకారుడు మహేశ్​ భూపతి. బుధవారం ఈ మేరకు ట్వీట్​ చేశాడు. సారథిగా తనను తప్పించినట్లు ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పాడు.

ఇటీవల మహేశ్‌ భూపతి స్థానంలో రోహిత్‌ రాజ్‌పాల్‌ను నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడం పెద్ద చర్చనీయాంశమైంది.

Mahesh Bhupathi on amid India's Davis Cup drama: I am still captain unless I hear otherwise
కెప్టెన్​ మహేశ్​ భూపతి

" సోమవారం ఏఐటీఏ సెక్రటరీ జనరల్​ ఛటర్జీ నాకు ఫోన్​ చేశారు. నా బదులుగా రోహిత్​ను కెప్టెన్​గా నియమించాలనుకుంటున్నట్లు చెప్పారు. గతంలో పాక్​​ వేదికగా డెవిస్​ కప్​లో ఆడేందుకు నేను నిరాసక్తత వ్యక్తం చేయడమే కారణంగా ఆయన తెలిపారు. అయితే తటస్థ వేదికపై మ్యాచ్​లు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికీ ఆటగాళ్లెవ్వరకీ సమాచారం లేదు. దాయాది దేశంలో కాకుండా ఎక్కడైనా ఆడేందుకు నేను సిద్ధమే. వేదిక మార్చితే డేవిస్​ కప్​కు అందుబాటులో ఉండి కెప్టెన్​గా వ్యవహరిస్తాను".
-- మహేశ్​ భూపతి, టెన్నిస్​ ప్లేయర్​

  • I have not heard from the AITA since Monday or after the ITF addressed the players concerns on venue and approved a neutral location - so I am available and believe in am still Captain unless I hear otherwise! Glad to "comment" when I know what I know🙏🏾

    — Mahesh Bhupathi (@Maheshbhupathi) November 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భూపతి బదులుగా రోహిత్​ ఎంపికను ప్రశ్నిస్తూ... డేవిస్​ కప్​ బృందంలోని మరో సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ)పై మండిపడ్డాడు. ఆటగాళ్లను సంప్రదించకుండా కెప్టెన్‌ను ఎలా మారుస్తారని ఏఐటీఏను ప్రశ్నించాడు.

వేదిక మార్చినట్లేనా...!

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్​ కప్​ మ్యాచ్‌లను... తటస్థ వేదికపై నిర్వహించడానికి అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఏఐటీఏ ఇటీవల వెల్లడించింది. అయితే ఐటీఎఫ్‌ ఇలా స్పందించడానికి ముందు ఒక దశలో భారత జట్టును పాక్‌కు పంపేందుకు ఏఐటీఏ సిద్ధమైంది. కానీ అందుకు కొందరు ఆటగాళ్లతో పాటు నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌ భూపతి అంగీకరించకపోవడం వల్ల అతడి స్థానంలో వేరొకరిని నియమించాలన్న నిర్ణయానికి ఏఐటీఏ వచ్చినట్లు వార్తలొచ్చాయి.

తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించడానికి ఐటీఎఫ్‌ సుముఖంగా కనిపించాక కెప్టెన్‌ను మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పాకిస్థాన్‌తో డేవిస్‌ కప్‌ పోరుకు తనే కెప్టెన్​గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు సీనియర్​ టెన్నిస్​ క్రీడాకారుడు మహేశ్​ భూపతి. బుధవారం ఈ మేరకు ట్వీట్​ చేశాడు. సారథిగా తనను తప్పించినట్లు ఇప్పటికీ ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పాడు.

ఇటీవల మహేశ్‌ భూపతి స్థానంలో రోహిత్‌ రాజ్‌పాల్‌ను నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ఎంపిక చేయడం పెద్ద చర్చనీయాంశమైంది.

Mahesh Bhupathi on amid India's Davis Cup drama: I am still captain unless I hear otherwise
కెప్టెన్​ మహేశ్​ భూపతి

" సోమవారం ఏఐటీఏ సెక్రటరీ జనరల్​ ఛటర్జీ నాకు ఫోన్​ చేశారు. నా బదులుగా రోహిత్​ను కెప్టెన్​గా నియమించాలనుకుంటున్నట్లు చెప్పారు. గతంలో పాక్​​ వేదికగా డెవిస్​ కప్​లో ఆడేందుకు నేను నిరాసక్తత వ్యక్తం చేయడమే కారణంగా ఆయన తెలిపారు. అయితే తటస్థ వేదికపై మ్యాచ్​లు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికీ ఆటగాళ్లెవ్వరకీ సమాచారం లేదు. దాయాది దేశంలో కాకుండా ఎక్కడైనా ఆడేందుకు నేను సిద్ధమే. వేదిక మార్చితే డేవిస్​ కప్​కు అందుబాటులో ఉండి కెప్టెన్​గా వ్యవహరిస్తాను".
-- మహేశ్​ భూపతి, టెన్నిస్​ ప్లేయర్​

  • I have not heard from the AITA since Monday or after the ITF addressed the players concerns on venue and approved a neutral location - so I am available and believe in am still Captain unless I hear otherwise! Glad to "comment" when I know what I know🙏🏾

    — Mahesh Bhupathi (@Maheshbhupathi) November 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భూపతి బదులుగా రోహిత్​ ఎంపికను ప్రశ్నిస్తూ... డేవిస్​ కప్​ బృందంలోని మరో సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ)పై మండిపడ్డాడు. ఆటగాళ్లను సంప్రదించకుండా కెప్టెన్‌ను ఎలా మారుస్తారని ఏఐటీఏను ప్రశ్నించాడు.

వేదిక మార్చినట్లేనా...!

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్​ కప్​ మ్యాచ్‌లను... తటస్థ వేదికపై నిర్వహించడానికి అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ఏఐటీఏ ఇటీవల వెల్లడించింది. అయితే ఐటీఎఫ్‌ ఇలా స్పందించడానికి ముందు ఒక దశలో భారత జట్టును పాక్‌కు పంపేందుకు ఏఐటీఏ సిద్ధమైంది. కానీ అందుకు కొందరు ఆటగాళ్లతో పాటు నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌ భూపతి అంగీకరించకపోవడం వల్ల అతడి స్థానంలో వేరొకరిని నియమించాలన్న నిర్ణయానికి ఏఐటీఏ వచ్చినట్లు వార్తలొచ్చాయి.

తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించడానికి ఐటీఎఫ్‌ సుముఖంగా కనిపించాక కెప్టెన్‌ను మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0352: China France AP Clients Only 4238387
Macron given ceremonial welcome in Beijing
AP-APTN-0348: Indonesia Cambodia AP Clients Only 4238386
Cambodian opp leader readies return from exile
AP-APTN-0330: SKorea NKorea Diamond Mountain AP Clients Only 4238385
SKorea offers to visit joint tour resort in North
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.