బెంగళూరుపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 5 వికెట్లు కోల్పోయి, 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు.. ప్రారంభం నుంచి తడబడింది. సన్రైజర్స్ బౌలర్ల ధాటిగా పరుగులు చేయడానికి కష్టపడింది. మరోవైపు వికెట్లు కూడా కోల్పోయారు.
ఆర్సీబీ బ్యాట్స్మెన్లో ఫిలిప్పీ(32), దేవదత్(5), కోహ్లీ(7), డివిలియర్స్(24), సుందర్(21), గుర్కీరత్ సింగ్(15), మోరిస్(3), సిరాజ్(2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్ తలో రెండు వికెట్లు.. రషీద్ ఖాన్, నటరాజన్, రషీద్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదన మొదలుపెట్టిన హైదరాబాద్.. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే ఓపెనర్ వార్నర్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మనీశ్ పాండే(26).. మరో ఓపెనర్ సాహా(39)తో కలిసి నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఔటయ్యారు. విలియమ్సన్(8), అభిషేక్ శర్మ(8), హోల్డర్(26) లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆర్సీబీ బౌలర్లలో చాహల్ 2 వికెట్లు, ఉదానా, సైనీ, సుందర్ తలో వికెట్ పడగొట్టారు.